కొవిడ్ టెస్ట్: 5 నిమిషాల్లోపే ఫలితం!
కరోనావైరస్ను అత్యంత వేగంగా గుర్తించగలిగే సాంకేతికతను బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
రూపొందించిన ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు
లండన్: కరోనా వైరస్ను అత్యంత వేగంగా గుర్తించగలిగే సాంకేతికతను బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం ఐదు నిమిషాల్లోపే వైరస్ను నిర్ధారించే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టును రూపొందించినట్లు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉండే ఎయిర్పోర్ట్, వాణిజ్య కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో భారీ స్థాయిలో కొవిడ్ టెస్టులు జరిపేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అయితే, ఈ పరికరాన్ని 2021 ప్రారంభంలో తయారు చేస్తామని, దీన్ని ఆమోదించిన అనంతరం ఆరు నెలల తర్వాత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విధానంలో ఇతర వైరస్లను వేరుచేస్తూ కరోనా వైరస్ను అత్యంత కచ్చితంగా గుర్తించగలదని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో అత్యంత తేలికగా, వేగంగా, తక్కువ ఖర్చుతో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని ఆక్స్ఫర్డ్లో భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ అచిల్లెస్ కపనిడీస్ స్పష్టంచేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎంతో కీలకమనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ విధానంలో కచ్చితంగా గుర్తిస్తున్నప్పటికీ, పరీక్షలకు సమయంతోపాటు ఖర్చుకూడా ఎక్కువగా ఉంటోంది. దీంతో ఇప్పటికే కొన్ని ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేసే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటిలో కరోనావైరస్ను గుర్తించే కచ్చితత్వంలో తేడాలుంటున్నాయి. దీంతో అత్యంత వేగంగా, కచ్చితమైన ఫలితమిచ్చే ర్యాపిడ్ టెస్టు కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్తోనే కలిసి జీవించాల్సి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో కరోనా వైరస్ వేగంగా గుర్తించడంలో ర్యాపిడ్ టెస్టులు ఎంతో కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలాఉంటే, కరోనా వైరస్ను వేగంగా గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం భారత్, ఇజ్రాయిల్లు కలిసి పనిచేస్తున్నాయి. భారత్లోని డీఆర్డీఓ, సీఎస్ఐఆర్తో ఇజ్రాయిల్ రక్షణశాఖకు చెందిన డీఆర్డీడీ కలిసి సంయుక్తంగా ర్యాపిడ్ టెస్టింగ్ పరిశోధన చేపట్టాయి. మరికొన్ని వారాల్లోనే ఈ నూతన టెస్టు ప్రయోగ ఫలితాలు రానున్నాయి. దీనిపై ఇజ్రాయిల్ విదేశాంగశాఖ ఈ మధ్యే అధికారిక ప్రకటన చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి