ఆక్స్ఫర్డ్ టీకా: వృద్ధుల్లో సమర్థవంతంగా..!
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహాయంతో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్, వృద్ధుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.
రెండో దశ ఫలితాలను ప్రచురించిన లాన్సెట్
ఫైజర్, మోడెర్నాల ప్రకటనల నేపథ్యంలో మరింత ఆసక్తి
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహాయంతో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్, వృద్ధుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తాజాగా ఫేజ్-2 క్లినికల్ ట్రయ్సల్ ఫలితాలను ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ ప్రచురించింది. వీటిలో మెరుగైన ఫలితాలు రావడంతో ప్రస్తుతం కొనసాగుతోన్న తుది దశ ప్రయోగాల్లోనూ వృద్ధుల్లో టీకా బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుందని ఆక్స్ఫర్ట్ భావిస్తోంది. అందుకే, తుదిదశ ప్రయోగ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో, టీకా ఫలితాల్లో ముందువరుసలో ఉన్న ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ టీకాలు ప్రదర్శించిన స్థాయిని ఈ టీకా అందుకుంటుందా? లేదా? అన్న విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
కరోనా వైరస్ ప్రభావం వృద్ధుల్లోనే ఎక్కువగా చూపిస్తోన్న విషయం తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్న వారిలోనూ ఎక్కువగా 60ఏళ్ల పైబడినవారే ఉంటున్నారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీకా ప్రయోగాలు కేవలం 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులపైనే జరుగుతున్నాయి. అయితే, ఆస్ట్రాజెనెకా మాత్రం వృద్ధుల్లోనూ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపడుతోంది. వీటిలోభాగంగా, 70ఏళ్లకు పైగా వయస్సు ఉన్నవారిపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. టీకా ఇచ్చిన అనంతరం యువకుల్లో మాదిరిగానే వయసుపైబడిన వారిలోనూ ఈ టీకా రోగనిరోధక ప్రతిస్పందన చూపిస్తున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. టీకా తీసుకున్న 560 మంది వాలంటీర్లలో 240 మంది 70ఏళ్లకు పైబడినవారే ఉన్నట్లు తెలిపింది. అయితే, టీకాతో స్వల్ప దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ మొదటి డోసు తీసుకున్న 14రోజుల్లో యాంటీబాడీల ప్రతిస్పందనను గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. తొలి డోసు తీసుకున్న 28రోజుల్లో రెండో డోసు (బూస్టర్ డోస్) వేయగా.. ఇది తీసుకున్న 209 మందిలో 208 మంది వాలంటీర్లలో టీకా స్థిరమైన పనితీరును కనబరిచినట్లు తాజా నివేదికలో పేర్కొన్నారు.
అయితే, వృద్ధుల్లో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపించడం చాలా సవాల్తో కూడుకున్నదని ఆక్స్ఫర్డ్ టీకా సమాచార విశ్లేషకురాలు ఏంజిలా మినాసియన్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రయోగాల్లో వృద్ధుల్లోనూ ఈ రకమైన సానుకూల ఫలితం ఇవ్వడం ద్వారా యువకులతోపాటు పెద్దవారిలోనూ టీకా సామర్థవంతంగా పనిచేస్తుందన్న భావవను ఆమె వ్యక్తం చేశారు. అయితే, వీటి తుది ఫలితాలు మరికొన్ని వారాల్లోనే వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఇదిలాఉంటే, తాము అభివృద్ధిచేసిన టీకా 95శాతం సమర్థత చూపిస్తున్నట్లు ఫైజర్ ఈమధ్యే వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే నియంత్రణ సంస్థల అనుమతి కోసం దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక మరో కంపెనీ మోడెర్నా తయారు చేసిన టీకా కూడా 94.5శాతం సమర్థత చూపిస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కూడా 92శాతం సమర్థత కలిగినట్లు ఇదివరకే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’గా భావిస్తోన్న ఆక్స్ఫర్డ్ టీకా తుదిదశ ఫలితం ప్రకటన ఆసక్తిగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు