ఆ ప్రయోగ విజయావకాశాలు 50శాతమే!
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విషయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అన్నింటికంటే ముందున్నట్లు తాజాగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడి కోసం రూపొందించిన ఈ ప్రయోగాత్మక టీకాపై తదుపరి పరీక్షలు చేపట్టాలని బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా నిర్ణయించారు.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విషయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అన్నింటికంటే ముందున్నట్లు తాజాగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడి కోసం రూపొందించిన ఈ ప్రయోగాత్మక టీకాపై తదుపరి పరీక్షలు చేపట్టాలని బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా నిర్ణయించారు. తొలి దశ ప్రయోగంలో మెరుగైన ఫలితాలు రావడంతో వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలకమైన రెండో దశలో దాదాపు 10వేల మంది వాలంటీర్లపై ప్రయోగించేందుకు ఆక్స్ఫర్డ్ సిద్ధమైంది. అయితే ఈ వ్యాక్సిన్ ప్రయోగ విజయావకాశాలు కేవలం 50శాతమేనని వ్యాక్సిన్ అభివృద్ధిచేస్తున్న ఆక్స్ఫర్డ్ జెన్నెర్ ఇన్స్టిట్యూట్ డైరక్టర్ ప్రొఫెసర్ అడ్రియన్ హిల్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి జరుగుతున్న పోటీలో ఆక్స్ఫర్డ్ తయారుచేసిన ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్ ప్రయోగదశల్లో ముందంజలో ఉన్నట్లు ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలాంటి కీలక సమయంలో బ్రిటన్లో ఈ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం ప్రయోగానికి అడ్డంకిగా మారే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమూహంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నందున ఈ పదివేల మంది వాలంటీర్లలో ఫలితం కనిపించకపోవచ్చనే ఆందోళన నెలకొందని అడ్రియన్ హిల్ అన్నారు. వైరస్ అదృశ్యం, సమయంపై ఈ వ్యాక్సిన్ ప్రయోగం ఆధారపడి ఉందని ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడ్రియన్ హిల్ వెల్లడించారు. ఇలాంటి సమయంలో 50శాతం ఫలితాలు రాకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు అడ్రియన్ హిల్ పేర్కొన్నారు. ప్రముఖ మందుల తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తోన్న విషయం తెలిసిందే.
గత ఏప్రిల్లో తొలిదశ ప్రయోగాల్లో భాగంగా మానవుల్లో ప్రయోగాత్మక పరిశోధనలు చేపట్టారు. తొలిదశలో మెరుగైన ఫలితాలు కనిపించడంతో ఈ వ్యాక్సిన్పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఏప్రిల్ నెలలో బ్రిటన్లో అత్యంత ప్రభావం చూపిన కొవిడ్ మహమ్మారి తీవ్రత మే నెలలో తగ్గుతూ వస్తోంది. ఈ సమయంలోనే వ్యాక్సిన్ ప్రయోగ విజయావకాశాలపై ఆందోళన నెలకొంది. బ్రిటన్లో ఇప్పటివరకు 2,57,000 మందికి ఈ వైరస్ సోకగా వీరిలో ఇప్పటివరకు 36వేల మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 54లక్షలకు చేరుకోగా వీరిలో ఇప్పటివరకు 3లక్షల 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్