మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాను: మోదీ

దివంగత భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొదటి వర్థంతి రోజున ప్రధాని మోదీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Published : 24 Aug 2020 11:38 IST

దిల్లీ: దివంగత భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి వర్థంతి రోజున ప్రధాని మోదీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జైట్లీని చాలా మిస్సవుతున్నానని అన్నారు. ట్విటర్‌లో నాటి వీడియోను ఒకదాన్ని జత చేసి, నివాళులు అర్పించారు. ‘గతేడాది ఈ రోజున అరుణ్‌ జైట్లీజీ మనకు దూరమయ్యారు. నా స్నేహితుడిని నేను ఎంతగానో మిస్సవుతున్నాను. ఆయన ఎంతో శ్రద్ధగా దేశానికి సేవ చేశారు. చాతుర్యం, తెలివి, చట్టపరమైన విజ్ఞానం, వ్యక్తిత్వంలో ఆయన మేటి’ అంటూ ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఇతర భాజపా నేతలు ఆయన సేవలను కొనియాడారు. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గతేడాది ఆగస్టు 24న జైట్లీ కన్నుమూశారు. ఆ సమయంలో మోదీ యూఏఈ పర్యటనలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు