పబ్జీ ప్రియులకు షాక్‌.. ఇక గేమ్‌ ఆడలేరు

పబ్జీ అభిమానులకు చేదు వార్త. ఇక నుంచి ఈ ఆటను ఆడలేరు. శుక్రవారం నుంచి పబ్జీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న పబ్జీ యూజర్లకు ఇక నుంచి ఆడే అవకాశం

Updated : 30 Oct 2020 14:46 IST

దిల్లీ: పబ్జీ అభిమానులకు చేదు వార్త. ఇక నుంచి ఈ ఆటను ఆడలేరు. శుక్రవారం నుంచి పబ్జీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న పబ్జీ యూజర్లకు ఇక నుంచి ఆడే అవకాశం ఉండదు. భారత ప్రభుత్వం నిషేధం విధించిన దాదాపు రెండు నెలల తర్వాత పబ్జీ తన సేవలను పూర్తిగా నిలిపివేసింది. 

పబ్జీ సహా 116 మొబైల్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం సెప్టెంబరులో నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో సెప్టెంబరు 2 నుంచి పబ్జీ కొత్త డౌన్‌లోడ్లు నిలిచిపోయాయి. అయితే నిషేధానికి ముందే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు గేమ్‌ ఆడే అవకాశం లభించింది. తాజాగా సర్వర్లను నిలిపివేయడంతో ఇకపై వారికి కూడా యాప్‌ పనిచేయదు. ఈ మేరకు పబ్జీ మొబైల్‌ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు అక్టోబరు 30 నుంచి భారత యూజర్లకు పబ్జీ మొబైల్‌ నోర్డిక్‌ మ్యాప్‌: లివిక్‌, పబ్జీ మొబైల్‌ లైట్‌ సేవలను టెన్సెంట్‌ గేమ్స్‌ నిలిపివేసింది. యూజర్ల డేటా భద్రతకు మేం అధిక ప్రాధాన్యమిస్తాం. భారత డేటా భద్రత చట్టాలను, నిబంధనలను ఎల్లప్పుడూ పాటించాం’ అని పబ్జీ మొబైల్‌ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు