పద్మ అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల గడువును కేంద్రం పొడిగించింది. సెప్టెంబర్‌ 15 వరకు పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 8035 దరఖాస్తులు రాగా.. వాటిలో 6361 దరఖాస్తుల పరిశీలన........

Published : 29 Aug 2020 01:11 IST

దిల్లీ: పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల గడువును కేంద్రం పొడిగించింది. సెప్టెంబర్‌ 15 వరకు పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 8035 దరఖాస్తులు రాగా.. వాటిలో 6361 దరఖాస్తుల పరిశీలన పూర్తి అయినట్లు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 1954 నుంచి వీటిని ఇస్తున్నారు. padmaawards.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పద్మ అవార్డులకు మీరు కూడా నామినేషన్లు/ ప్రతిపాదనలు పంపొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు