‘కొత్త’కష్టం: 8గంటలకు పైగా ఎయిర్పోర్టులోనే..
బ్రిటన్లోని కొత్త కరోనా వైరస్ భారత్లోనూ అలజడి రేపుతోంది. యూకే నుంచి భారత్కు చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25మందికి పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు యూకే నుంచి .........
కొవిడ్ రిపోర్టుల కోసం పడిగాపులు
దిల్లీ: బ్రిటన్లోని కొత్త కరోనా వైరస్ భారత్లోనూ అలజడి రేపుతోంది. యూకే నుంచి భారత్కు చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25మందికి పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్లు చేయిస్తున్నారు. దీంతో నిన్న రాత్రి దిల్లీకి చేరుకున్న ప్రయాణికులు తమ రిపోర్టుల కోసం ఎనిమిది గంటలకు పైగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. కొవిడ్ టెస్ట్ రిపోర్టు వచ్చాకే వారిని బయటకు పంపాలనే నిబంధనలు ఉండటంతో దాదాపు 500 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు ప్రత్యేక నియమావళి అనుసరించాల్సి ఉండటంతో రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతున్నట్టు విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ కలకలంతో డిసెంబర్ 22 నుంచి 31 వరకు విమాన సర్వీసులను భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధానికి ముందు రోజు వరకు యూకే నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికులు, సిబ్బందికి ఆర్టీ పీసీఆర్ తప్పనిసరి చేస్తూ విమానాశ్రయ అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దీంతో నిన్న రాత్రి యూకే నుంచి వచ్చిన దాదాపు 500 మంది ప్రయాణికులు దిల్లీ విమానాశ్రయం వద్ద రిపోర్టుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. భారత్తో పాటు 30కి పైగా దేశాలు యూకేకు తాత్కాలికంగా ప్రయాణాలపై నిషేధం విధించాయి. జన్యు మార్పిడి చేసుకున్న ఈ కొత్త రకం వైరస్ సెప్టెంబర్ నుంచే బ్రిటన్లో ప్రబలుతున్నందున ఇప్పటికే అక్కడి నుంచి వచ్చినవారి ద్వారా మన దేశానికి ఈ వైరస్ చేరి ఉండొచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
‘గత రాత్రి నుంచి విమానాశ్రయంలోనే ఉండిపోయాం. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ భౌతికదూరం ఉల్లంఘన జరుగుతోంది’ అంటూ ఓ ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్