క్షీణిస్తోన్న ప్రణబ్‌ ఆరోగ్యం..!

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం క్షీణిస్తోందని దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఉపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.

Published : 26 Aug 2020 12:09 IST

దిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం క్షీణిస్తోందని దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఉపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. ఆయనకు నిన్నటినుంచి కిడ్నీ సంబంధ సమస్యలు కూడా ఎదురౌతున్నట్లు తాజా బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం కోమాలో ఉన్న ప్రణబ్‌ ముఖర్జీకి వెంటిలేటర్‌ సహాయంతోనే చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుప్రతి ప్రకటించింది. 

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10వ తేదీన ప్రణబ్‌ ముఖర్జీ దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. అనంతరం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యబృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని