ప్రణబ్ దాదా.. రాజకీయ కాళిదాసు!
దేశ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను చూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటరీ వ్యవస్థనే ఔపోసన పట్టిన అపర చాణుక్యుడు. రాజకీయాల్లో ఆకాశ పాతాళాలను చవి చూసిన వాస్తవికవాది. చరిత్ర పుటలను నాలుక కొసన.......
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను చూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మనకు ఇకలేరు. పార్లమెంటరీ వ్యవస్థనే ఔపోసన పట్టిన అపర చాణుక్యుడైన ప్రణబ్ దాదా సోమవారం సాయంత్రం దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో ఆకాశ పాతాళాలను చవి చూసిన వాస్తవికవాది ఆయన. చరిత్ర పుటలను నాలుక కొసన పెట్టుకున్న రాజకీయ కాళిదాసు. ఏ అంశం మీదైనా అనర్గళంగా ప్రసంగించగలిన వాచస్పతి. మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించడమే కాదు.. తెరవెనక మంత్రాంగం నెరపడంలోనూ సిద్ధహస్తుడు. సంక్షోభ సమయంలో చిక్కుముడులను అవలీలగా విప్పే నేర్పరి. చాణక్యం, హాస్య చాతుర్యం, గాంభీర్యం, ఆగ్రహం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలిసిన ప్రణబ్ ముఖర్జీ జీవిత ప్రస్థానంలోని విశేషాలు..
సంక్షోభ పరిష్కర్త
పార్టీలోనూ, పార్లమెంట్ వ్యవహారాల్లోనూ సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా కాంగ్రెస్ అధిష్ఠానానికి ముందు గుర్తొచ్చేది ప్రణబ్ ముఖర్జీనే. రాజీవ్ మరణానంతరం అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి.. తుదిశ్వాస వరకు ఆ పదవిలో కొనసాగాలన్న పట్టుదలతో ఉన్నప్పుడు ఆయన్ను తప్పించే బాధ్యత సోనియా.. ప్రణబ్కే అప్పగించారు. 1988 మార్చి 14న ప్రణబ్ తన నివాసంలో చాణక్యం ప్రదర్శించి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.
* ఆ తర్వాత ఏడాది సోనియా విదేశీయత అంశాన్ని లేవనెత్తిన శరద్ పవార్, తారిఖ్ అన్వర్, పీఏ సంగ్మాలను ఎదుర్కొనే బాధ్యతనూ మళ్లీ ప్రణబ్కే అప్పగించారు. ఈ పనినీ సమర్థంగా నిర్వర్తించారు. ఆ సమయంలో సోనియా లేఖలను రూపొందించింది కూడా ప్రణబ్ అనే చెబుతారు.
* విపక్షాల నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించినప్పుడు ఎన్నోసార్లు వారితో మాట్లాడి రాజీకి ఒప్పించిన నేర్పరి. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలతో తలనొప్పులు వచ్చినప్పుడూ ఆయనే మధ్యవర్తి.
ఇందిరకు విశ్వాసపాత్రుడు
2004, 2009 ప్రత్యక్ష ఎన్నికల్లో తప్పించి ప్రణబ్ ఎప్పుడూ లోక్సభకు ఎన్నికకాలేదు. అయినా ఇందిరాగాంధీ ఆయనకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పజెప్పారు. తన గైర్హాజరులో మంత్రివర్గ సమావేశాలకు మిగిలిన వారి కంటే జూనియర్ అయిన ప్రణబ్కే అధ్యక్షత వహించే అవకాశం కల్పించేవారు.
రాజీవ్తో విభేదాలు
ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన పరిణామాలు రాజీవ్ గాంధీకి ప్రణబ్ను దూరం చేశాయి. ఇందిర హత్య సమయంలో రాజీవ్, ప్రణబ్ బెంగాల్లో ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరవుతారు అని రాజీవ్.. ప్రణబ్ను అడిగితే అత్యంత సీనియర్ మంత్రి ఆ బాధ్యతలు చేపడతారని, నెహ్రూ, లాల్బహదూర్ శాస్త్రి మరణానంతరం అదే జరిగిందని ప్రణబ్ అన్నట్టు చెబుతారు. అప్పటికి ప్రణబ్ ముఖర్జీయే సీనియర్ మంత్రి. ఇది రాజీవ్ ఆగ్రహానికి కారణమైందని చెబుతారు. తర్వాత కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా ప్రణబ్ హోదాను తగ్గిస్తూ ఆయన్ను బెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా రాజీవ్ నియమించడంతో కినుక వహించి 1986లో రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ను స్థాపించారు. అప్పట్లో రాజీవ్ ఆయన్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు కూడా. 1987లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పేరుపై పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. ఆ తర్వాత కూడా మునుపటి ప్రాధాన్యం లభించలేదు. పీవీ నరసింహారావు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్లీ పూర్వ వైభవం సాధ్యమైంది.
మరోసారి చేజారిన ప్రధాని అవకాశం
రాజీవ్ దుర్మరణంతో పీవీ నరసింహారావు కాంగ్రెస్ నాయకత్వం చేపట్టి ప్రధాని అయ్యారు. వాస్తవానికి పీవీ కంటే ప్రణబ్ ముఖర్జీయే సీనియర్. అయితే, అంతకముందు పార్టీ వీడి మళ్లీ చేరడంతో సాంకేతికంగా కొత్త నేత అయ్యారు. దీంతో ప్రధాని పదవి చేపట్టడానికి పార్టీ పరంగా అనర్హులయ్యారు. సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావడానికి అంగీకరించిన తర్వాత ప్రణబ్ ఆమె కోటరీలో కీలక వ్యక్తిగా అవతరించారు. కఠిన సమయాల్లో సముచిత సలహాలిస్తూ అధిష్ఠానానికి విధేయుడిగా మెలిగారు ప్రణబ్.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా..!
47 ఏళ్ల వయస్సులో తొలిసారి పెద్ద ఆఖ అయిన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టి.. ఆర్థికశాఖను పిన్న వయస్సులో చేపట్టిన మంత్రిగా ప్రణబ్ పేరు పొందారు. 1984లో యూరోమని మ్యాగజీన్ నిర్వహించిన ఓ సర్వేలో ప్రణబ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా ఎంపికయ్యారు. ప్రణబ్ కార్యదక్షత దేశీయ వ్యవహారాలకే పరిమితం కాదు. అణుఒప్పందం వ్యవహారంలో అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదొడుకులు రాకుండా అమెరికా అధ్యక్షుడితో మంతనాలు జరిపిన సమర్థత ఆయనది.
ఇదీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. -
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?