ఆపాలని అభిజిత్.. ఆటంకాలొద్దని శర్మిష్ఠ
మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’పై ఆయన కుమారుడు, కుమార్తెల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ పుస్తకాన్ని వెంటనే ఆపేయాలని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ప్రచురణకర్తలను కోరగా...
ప్రణబ్ పుస్తకంపై కుమారుడు, కుమార్తెల వాగ్వాదం
దిల్లీ: మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’పై ఆయన కుమారుడు, కుమార్తెల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ పుస్తకాన్ని వెంటనే ఆపేయాలని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ప్రచురణకర్తలను కోరగా.. అనవసర ఆటంకాలు సృష్టించవద్దంటూ ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తన సోదరుడికి సూచించారు. టిట్టర్ వేదికగా ఇద్దరూ ఈ పుస్తక ప్రచురణ అంశంపై విభేదించారు. వచ్చే జనవరిలో రూపా పబ్లిషర్స్ ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్న ఈ పుస్తకంలోని పలు అంశాలు ఇటీవల వార్తలకెక్కాయి. ఇందులో కాంగ్రెస్పై ప్రణబ్ చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తిని పెంచాయి. తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృష్టిని కోల్పోయినట్లు ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వైఖరిపైనా ప్రణబ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ కుమారుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిజిత్ - తాను సమ్మతిని తెలిపేంతవరకు ఈ పుస్తకాన్ని ప్రచురించవద్దని ప్రచురణకర్తలను కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. తక్షణం ప్రచురణను నిలిపివేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ‘‘ఇందులోని కొన్ని ప్రేరేపిత అంశాలు వార్తలకెక్కాయి. నా తండ్రి దివంగతులైన నేపథ్యంలో ఆయన కుమారుడిగా పుస్తకం తుదిప్రతి(ఫైనల్ కాపీ)లోని అంశాలను ప్రచురణకు ముందే నేను పరిశీలించాలని అనుకుంటున్నాను. నా తండ్రి జీవించి ఉంటే ఆయన కూడా అదేపని చేసేవారు.’’ అని పేర్కొన్నారు.
సోదరా.. ఆపవద్దు : శర్మిష్ఠ
అభిజిత్ వ్యాఖ్యలపై ఆయన సోదరి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శర్మిష్ఠ స్పందించారు. ‘‘పుస్తక రచయిత కుమార్తెగా నేను నా సోదరుడు అభిజిత్ను కోరుతున్నాను. మన తండ్రి రాసిన చివరి పుస్తకం ప్రచురణకు అనవసర ఆటంకాలు సృష్టించొద్దు. ఆయన అనారోగ్యానికి గురికాకముందే లిఖితప్రతిని పూర్తి చేశారు. తుది ముసాయిదాలో తన తండ్రి చేతిరాతతో విషయాలు, వ్యాఖ్యలు ఉన్నాయి. వాటికి కట్టుబడి ఉండాలి.’’ అని పేర్కొన్నారు. తన తండ్రి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన సొంతమని, చౌకబారు ప్రచారం కోసం వాటిని ప్రచురితం కాకుండా ఎవరూ ఆపేందుకు ప్రయత్నించవద్దని కూడా సూచించారు. అది దివంగత నేతకు చేసే అపకారం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుస్తకం పేరును అభిజిత్ తప్పుగా పేర్కొనడాన్ని ఆమె ప్రస్తావించగా.. అనంతరం అభిజిత్ ఆ పేరును మరో ట్వీట్లో సరిదిద్దారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం