నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సన్నాహాలు

భారత నూతన పార్లమెంటు భవనం నిర్మాణం పనుల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Published : 18 Nov 2020 00:12 IST

నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన లోక్‌సభ స్పీకర్‌

దిల్లీ: భారత నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త భవనం రక్షణ గోడ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల వల్ల చోటుచేసుకునే దుమ్ము, కాలుష్యాన్ని నిరోధించేందుకు వలలు ఏర్పాటు చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇటీవల ఈ ప్రాంగణాన్ని సందర్శించారు. నిర్మాణ కార్యక్రమాన్ని గురించి గుత్తేదారులకు సూచనలు చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు స్పీకర్‌కు వివరించారు. నిర్మాణ పనులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే జరుగుతాయన్నారు. అన్ని ఏర్పాట్లు  పూర్తయిన అనంతరం పనులు లాంఛనంగా డిసెంబర్‌లో ప్రారంభిస్తామని వారు వివరించారు. కాగా భవన నిర్మాణం అక్టోబర్‌ 2022 కల్లా పూర్తి కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని