దిల్లీ కాలుష్యానికి ఆ సీఎంలదే బాధ్యత: అతిషి

దేశ రాజధాని నగరంలో కాలుష్యం పెరగడానికి హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులదే ప్రత్యక్ష బాధ్యత అని ఆప్‌ నేత, ఎమ్మెల్యే అతిషి ఆరోపించారు............

Published : 19 Nov 2020 02:03 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం పెరగడానికి హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులదే ప్రత్యక్ష బాధ్యత అని ఆప్‌ నేత, ఎమ్మెల్యే అతిషి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆమె కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ కంట్రోల్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. గత నెలన్నర కాలంగా పంట వ్యర్థాలను కాల్చడంతో దిల్లీ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు.  నేరపూరిత నిర్లక్షంతో వ్యవహరిస్తూ దిల్లీలో కాలుష్యానికి కారణమవుతున్న ఆ ఇద్దరు ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కమిషన్‌తో పాటు సుప్రీం కోర్టు కూడా ఈ అంశాన్ని సుమోటోగా విచారణ చేపట్టాలని ఆప్‌ అప్పీల్‌ చేయాలనుకుంటోందని తెలిపారు. ఉత్తర భారత దేశ ప్రజా ఆరోగ్యాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉంచుతున్న ఆ రెండు రాష్ట్రాల సీఎంలపై చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని దిల్లీలో కాలుష్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని