వైరస్ వ్యాప్తి తగ్గింది..!
కరోనా.. అత్యంత వేగంగా వ్యాపించే వ్యాధి.. దీనిని కట్టడి చేయాలంటే వ్యాప్తిని అడ్డుకోవాల్సిందే. ఒక కరోనా రోగి సగటున ఎంతమందికి ఈ వ్యాధిని వ్యాప్తిచేస్తాడనే విషయాన్ని తెలిపే కొలమాన్ని ‘ఆర్’ విలువ అంటారు. దీనిని ‘ఆర్నాట్’ అని కూడా పిలుస్తారు. దీనిని ప్రతివారం లెక్కిస్తారు. దీనిని విలువ ఎంత ఎక్కవ వస్తే వ్యాధి అంత ఎక్కువ మందికి వ్యాపిస్తోందని
తొలిసారిగా 1 కంటే తక్కువగా ‘ఆర్’ విలువ
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
కరోనా.. అత్యంత వేగంగా వ్యాపించే వ్యాధి.. దీనిని కట్టడి చేయాలంటే వ్యాప్తిని అడ్డుకోవాల్సిందే. ఒక కరోనా రోగి సగటున ఎంతమందికి ఈ వ్యాధిని వ్యాప్తిచేస్తాడనే విషయాన్ని తెలిపే కొలమానాన్ని ‘ఆర్’ విలువ అంటారు. ‘ఆర్నాట్’ అని కూడా పిలుస్తారు. దీనిని ప్రతివారం లెక్కిస్తారు. దీని విలువ ఎంత ఎక్కువ వస్తే వ్యాధి అంత ఎక్కువ మందికి వ్యాపిస్తోందని అర్థం. ప్రభుత్వాలు లాక్డౌన్లు విధించినా.. భౌతిక దూరం నిబంధనలు అమలు చేసినా... ఈ ఆర్ విలువను అదపు చేయడానికే.
కొవిడ్ వ్యాప్తిరేటు ఎక్కువ..?
సాధారణ ఫ్లూ సోకిన ఐదు రోజుల్లోపే లక్షణాలు బయటపడిపోతాయి. ఈ క్రమంలో ఆ వ్యక్తి అప్రమత్తమై చికిత్స తీసుకొంటాడు. దీనికి తోడు వ్యాక్సిన్ తీసుకొన్నవారిని, వ్యాధి నిరోధక శక్తి ఉన్న వారిని ఇది ఏమీ చేయలేదు. ఈ రెండు లేనివారికి మాత్రమే సోకుతుంది. అందుకే దీని వ్యాప్తిరేటు(ఆర్నాట్) 1.3గా ఉంది. కానీ, కొవిడ్లో 14 రోజుల పాటు లక్షణాలు బయటపడకుండా ఉండేందుకు అవకాశం ఉంది. దీని వ్యాప్తిరేటు 2-2.5గా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు వారాలపాటు వ్యాధిగ్రస్తుడు పలువురికి దీన్ని అంటిస్తాడు. పైగా కొవిడ్కు ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడం, ప్రజల్లో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందకపోవడంతో రోగి పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరికి సోకే ప్రమాదం ఉంది.
సాధారణ ఫ్లూ వ్యాప్తిరేటు 1.3 అనుకుంటే. పది దశలు దాటాక అది 56 మందికి సోకే అవకాశం ఉంది. అదే కొవిడ్-19 వ్యాప్తిరేటు కనిష్ఠంగా 2 అనుకుంటే పది దశలు దాటాకా 2047 మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.
ఈ వారం తగ్గుదల..
చెన్నైలోని ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాథమేటికల్ సైన్స్’ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఈ వారం ఆర్ విలువ 0.93గా నమోదైంది. గత వారం ఇదే విలువ 1.08గా ఉంది. ముఖ్యంగా కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటకలో కూడా ఈ విలువ 1 కంటే తక్కువకు రావడం ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడి కొవిడ్ వ్యాప్తిలో తగ్గుదల నమోదైంది. భారత్లో కరోనావ్యాప్తి మొదలైన తర్వాత ఇంత తక్కువ ఆర్విలువ ఎప్పుడూ నమోదు కాలేదు.
తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లో ఇలా..
* ఆంధ్రప్రదేశ్లో ఆర్విలువ 0.95 నుంచి 0.80కు తగ్గింది. తెలంగాణలో ఇది 0.94 నుంచి 0.92కి చేరింది.
* ఈ వారం మహారాష్ట్రల్లో ఆర్ విలువ 0.86గా నమోదైంది. గత వారం ఇది 1.17గా ఉంది.
* కర్ణాటకలో గత వారం ఆర్విలువ 0.95గా నమోదు కాగా... ఈ సారి అది 0.80కు తగ్గింది.
* తమిళనాడులో మాత్రం ఈ విలువ పెరగింది. గత వారం 0.93గా ఉండగా.. ఈ సారి అది 0.99కు చేరింది.
* ఇక ఉత్తర్ ప్రదేశ్లో 1.10 నుంచి 0.91కు తగ్గింది.
* ఒడిశాలో 1.11 నుంచి 1.04కు చేరింది.
* పంజాబ్లో 1.16 నుంచి 1.07కు పడిపోయింది.
* కేరళలో వ్యాప్తి రేటు పెరిగింది. ఇది 1.07 నుంచి 1.20కు వచ్చింది.
అక్కరకొస్తున్న పరీక్షలు..
భారీ సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగిని ముందుగానే గుర్తించడంతో వ్యాప్తి కొంత తగ్గింది. దీనికి తోడు అత్యవసర చికిత్సకు వాడే ఔషధాలు కూడా అందుబాటులోకి రావడంతో ఒక వ్యక్తిలో ఎక్కువ రోజులపాటు ఈ వ్యాధి ఉండటం లేదు. అంటే అతను ఇతరులకు వ్యాధిని అంటించే అవకాశాలు కూడా ఆమేరకు తగ్గినట్లే.
నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 14లక్షల 92వేల పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షల్లో 86,052 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,570కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో గడిచిన 24గంటల్లో 81వేల మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
వ్యాధి అంతం ఇలా..
అంటు వ్యాధులను కనుమరుగు చేయడానికి కొంతకాలం పాటు ఆర్ విలువను 1కంటే తక్కువగా ఉంచడం చాలా అవసరం. భారత్ వంటి జనసాంధ్రత ఉన్న దేశాల్లో ఇది చాలాకష్టం. కానీ, ప్రస్తుతం భారత్లో రికవరీలు వేగంగా పెరగడం.. ఆర్ విలువ తగ్గడంతో వ్యాధిపై మెల్లగా పట్టు సాధిస్తున్నాం. కొంత కాలం పాటు ఆర్ విలువను 1కంటే తక్కువగా ఉంచగలిగితే ఈ వ్యాధి అదృశ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, అది అంత తేలిగ్గా సాధ్యమయ్యే విషయం కాదు. దిల్లీలో దాదాపు నెల రోజులు ఆర్ విలువను 1కంటే తక్కుగా ఉండేట్లు చేశారు. కానీ, ఇప్పుడు ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు