దుస్సాహసం ప్రదర్శించేవారికి గట్టి హెచ్చరిక
రఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత్, ఫ్రాన్స్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ గురువారం అన్నారు. భారత వైమానిక దళంలోకి రఫేల్ యుద్ధ విమానాల చేరిక కార్యక్రమంలో ఆయన ఫ్రాన్స్ రక్షణమంత్రి ప్లొరెన్స్ పార్లెతో కలిసి పాల్గొన్నారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
దిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత్, ఫ్రాన్స్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ గురువారం అన్నారు. భారత వైమానిక దళంలోకి రఫేల్ యుద్ధ విమానాల చేరిక కార్యక్రమంలో ఆయన ఫ్రాన్స్ రక్షణమంత్రి ప్లొరెన్స్ పార్లెతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హరియాణాలోని అంబాలా వైమానిక దళ కేంద్రం వేదికైంది. రఫేల్ విమానాలను అధికారికంగా ఐఏఎఫ్లోకి ప్రవేశపెట్టిన అనంతరం రాజ్నాథ్ మాట్లాడుతూ.. ‘రఫేల్ యుద్ద విమానాలరాకతో భారత్, ఫ్రాన్స్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. భవిష్యత్తులోనూ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. దేశానికి రక్షణ పరంగా ఇదో చరిత్రాత్మక ఘట్టం. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్కు రక్షణ పరంగా రఫేల్ విమానాలు ఎంతో ఉపయోగపడతాయి. దేశీయ రక్షణరంగ పరిశ్రమను ప్రోత్సహించేలా భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ను ఆహ్వానించాం. ఇక్కడ రక్షణ రంగంలో 74శాతం ఎఫ్డీఐలు అనుమతించబడ్డాయి. ఈ అవకాశాన్ని ఫ్రాన్స్ వినియోగించుకుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
నేడు ఐఏఎఫ్లోకి రఫేల్ విమానాల చేరికతో భారత్పై దుస్సాహసం ప్రదర్శించాలనుకునే వారికి గట్టి సందేశం ఇచ్చినట్లయిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ తెలిపారు. ఇటీవల చైనా సరిహద్దు రేఖ (ఎల్ఏసీ) వద్ద ఐఏఎఫ్ అప్రమత్తంగా వ్యవహరించిన తీరుఎంతో అభినందించదగినదని చెప్పారు. ‘‘ జాతీయ భద్రతే మాకు మొదటి ప్రాధాన్యత. భవిష్యత్తులో యుద్ధాలకు దారి తీసే పరిస్థితులు వస్తే.. వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుంది. మా పరిధుల్లోనేకాక ఇండో-పసిఫిక్, హిందూమహా సముద్ర ప్రాంతంలోనూ శాంతికి కట్టుబడి ఉన్నాం. ఆ ప్రాంతాల్లో మా పాత్ర క్రమంగా పెరుగుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటమే భారత్, ఫ్రాన్స్ దేశాల ప్రధాన అజెండా. ఉగ్రవాదం నుంచి ముప్పును ఏ మాత్రం విస్మరించేది లేదు’’ అని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్ బదౌరియా మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో ఇవి దళంలోకి రావడం మంచి విషయం. ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ విమానాలు పరిస్థితులను అదుపులోకి తేగలవు’అని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ నేను ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడాన్ని గొప్పగా భావిస్తున్నానని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ప్లోరెన్స్ పార్లె అన్నారు. ‘భారత్, ఫ్రాన్స్కు ఇదో గొప్ప విజయం. రఫేల్ యుద్ధ విమానాలు భారత్, ఫ్రాన్స్ సంబంధాల్ని సూచిస్తున్నాయి. భారత దేశానికి ప్రపంచ స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.’ అని ఆమె తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న