రాజస్థాన్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా

దేశవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు భాజపా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది

Published : 08 Nov 2020 20:05 IST

జైపూర్‌ : దేశవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు భాజపా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. భాజపా ఎమ్మెల్యేలు నర్పత్‌ సింగ్‌ రజ్వీ, మదన్‌ దిలావర్‌తో పాటు మరో శాసనసభ్యుడు బాబూలాల్‌ వైరస్‌ బారిన పడ్డారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడినట్లు తనకు దృష్టికి వచ్చినట్లు తెలిపిన ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లోత్‌.. వాళ్లు త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు