రామజన్మభూమి ట్రస్ట్‌ సారథికి కరోనా పాజిటివ్‌!

రామజన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు సమాచారం. అయితే ఈ మధ్యే అయోధ్యలో జరిగిన మందిర భూమిపూజ కార్యక్రమాలను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు.

Updated : 13 Aug 2020 13:34 IST

నృత్యగోపాల్‌ దాస్‌కు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ
భూమిపూజ కార్యక్రమంలో ప్రధానితో వేదిక పంచుకున్న నృత్యగోపాల్‌

అయోధ్య: రామజన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఈ మధ్యే అయోధ్యలో జరిగిన మందిర భూమిపూజ కార్యక్రమాలను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వేదికను పంచుకున్నారు. వైదికపై ఉన్న ఐదుగురు ప్రముఖుల్లో నృత్యగోపాల్‌దాస్‌ ఒకరు. ప్రస్తుతం కృష్ణజన్మాష్టమి సందర్భంగా నృత్యగోపాల్‌ దాస్‌ మథురలో ఉన్నారు. అక్కడే ఆయనకు శ్వాసకోస సమస్యలు ఏర్పడటంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్యగోపాల్‌దాస్‌కు కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది.   

అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో భాగంగా మోదీతోపాటు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామజన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌ వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందే, మందిర పూజారి ప్రదీప్‌దాస్‌తో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని