కొవిడ్తో రక్తం గడ్డకట్టే ప్రమాదం
కొవిడ్ కేవలం ఊపిరితిత్తుల వ్యాధి మాత్రమే కాదని... రక్తనాళాల రుగ్మత గానూ పరిగణించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఆధారాలతో నిపుణుల విశ్లేషణ
దిల్లీ: కొవిడ్ కేవలం ఊపిరితిత్తుల వ్యాధి మాత్రమే కాదని... రక్తనాళాల రుగ్మత గానూ పరిగణించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా రక్తం గడ్డకడుతోందని, అవయవాలను కాపాడేందుకు ఒక్కోసారి గడ్డలను తొలగించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం- ఆసుపత్రుల్లో చేరుతున్న కొవిడ్ బాధితుల్లో 14-28% మంది డీప్ వీన్ థ్రోంబోసిస్ (డీవీటీ)కు గురవుతున్నారు. వీరికి కాళ్లలోని నాళాల్లో రక్తం గడ్డకడుతోంది. ఇక 2-5% మందికి హృద్ధమనుల్లో రక్తం గడ్డల్లా పేరుకుపోతోంది. ధమనులు గుండె నుంచి అధిక ఆక్సిజన్తో రక్తాన్ని శరీరానికి తీసుకెళ్తే... సిరలు అక్కడి నుంచి తక్కువ ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండెకు తిరిగి చేరుస్తాయి. రక్తం గడ్డకట్టడం వల్ల ప్రసరణలో ఇబ్బందులు తలెత్తి... 2-5% మంది కొవిడ్ బాధితుల్లో గుండెపోటు, పక్షవాతం, అవయవ నష్టం సంభవిస్తోంది. ‘‘మా ఆసుపత్రిలో వారానికి కనీసం 5-6 కేసుల్లో రక్తం తీవ్రస్థాయిలో గడ్డకట్టే పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిరోజులుగా ఇలాంటి బాధితుల సంఖ్య పెరుగుతోంది’’ అని దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి సర్జన్ డా.అంబరిష్ సాత్విక్ చెప్పారు. ముఖ్యంగా టైప్-2 మధుమేహంతో ఇబ్బందులు పడుతున్న కొవిడ్ బాధితుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటున్నట్టు దిల్లీలోని ఆకాశ్ హెల్త్కేర్ హృద్రోగ నిపుణుడు అమరీశ్ కుమార్ చెప్పారు. ‘‘రక్తం గడ్డకట్టే పరిస్థితికి కొవిడ్ దారితీస్తోంది. ఓ కోవిడ్ బాధితుడి ధమనుల నుంచి ఇలాంటి గడ్డలను విజయవంతంగా తొలగించాం కూడా. ఏడాదిగా తీవ్రస్థాయి కొవిడ్ బాధితులను చూస్తున్నాం. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులకు ఎంత ఇబ్బంది కలుగుతోందో, రక్తనాళాలకూ అంతే హాని జరుగుతోంది’’ అని సాత్విక్ చెప్పారు. కొవిడ్కూ, రక్తం గడ్డకట్టడానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్టు ప్రముఖ వైద్య జర్నల్ ‘ద లాన్సెట్’ ఇప్పటికే పలు అధ్యయనాలను విశ్లేషించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు