హాథ్రస్‌ కేసులో సాక్ష్యులను ఎలా రక్షిస్తున్నారు?

హాథ్రస్‌ హత్యాచార ఘటన దిగ్భ్రాంతికరమని, ఈ ఘోరంపై పదే పదే వాదనలు వినాలనుకోవడం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. హాథ్రస్‌ ఘటనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ కేసులో సాక్ష్యులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Published : 06 Oct 2020 13:52 IST

యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

విచారణ వచ్చేవారానికి వాయిదా

దిల్లీ: హాథ్రస్‌ హత్యాచార ఘటన దిగ్భ్రాంతికరమని, ఈ ఘోరంపై పదే పదే వాదనలు వినాలనుకోవడం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. హాథ్రస్‌ ఘటనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ కేసులో సాక్ష్యులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేగాక, బాధిత కుటుంబం న్యాయవాదిని ఏర్పాటుచేసుకుందా.. లేదా.. అని అడిగింది. దీనిపై బుధవారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే తాము గురువారం అఫిడవిట్‌ దాఖలు చేస్తామని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.  

అంతకుముందు యూపీ ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. హాథ్రస్‌ కేసులో ఎన్నో అవాస్తవ కథనాలు వినిపిస్తున్నాయని, వాటిని అరికట్టాలని యూపీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహత్‌ కోర్టుకు తెలిపారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వీటిని అరికట్టేలా హాథ్రస్‌ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ఉండేందుకే మృతురాలి అంత్యక్రియలను అర్ధరాత్రి నిర్వహించాల్సి వచ్చిందని అఫిడవిట్‌లో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు