బుల్లెట్ రైలుకు శివసేన షాక్‌..! 

అహ్మదాబాద్‌- ముంబయి బుల్లెట్‌ రైలుకు అవాంతరం ఎదురైంది. థానే జిల్లా పరిధిలోని భూమిని ఈ రైలు ప్రాజెక్ట్‌కు బదలాయించేందుకు ఆ పార్టీ....

Published : 25 Dec 2020 01:36 IST

భూ బదలాయింపు ప్రతిపాదనకు తిరస్కరణ

థానే: అహ్మదాబాద్‌- ముంబయి బుల్లెట్‌ రైలుకు అవాంతరం ఎదురైంది. థానే జిల్లా పరిధిలోని భూమిని ఈ రైలు ప్రాజెక్ట్‌కు బదలాయించేందుకు ఆ పార్టీ నేతృత్వంలోని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ (టీఎంసీ) తిరస్కరించింది. ముంబయి మెట్రో కార్‌ షెడ్‌  విషయంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

థానే జిల్లాలోని షిల్‌- దాయ్‌ఘర్‌ ప్రాంతంలో 3,800 చదరపు మీటర్ల భూమిని బదలాయించాలన్న నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) ప్రతిపాదనను టీఎంసీ పాలక మండలి తోసిపుచ్చింది. గతంలో నాలుగుసార్లు ఇదే అంశం చర్చకు వచ్చినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని పాలక మండలి.. తాజాగా జరిగిన సమావేశంలో తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

ముంబయిలోని ఆరే కాలనీలో ఉన్న మెట్రో కార్‌ షెడ్‌ను కంజూర్‌ మార్గ్‌కు తరలించచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ హైకోర్టును ఆశ్రయించింది. అది కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యవహారమని, రాష్ట్రంతో సంబంధం లేదని పేర్కొంది. దీంతో భూకేటాయింపుపై హైకోర్టు స్టే విధించింది. గతంలో పర్యావరణవేత్తలు వ్యతిరేకించినప్పటికీ అప్పటి భాజపా ప్రభుత్వం కార్‌షెడ్‌ను ఏర్పాటుకు ఆరే కాలనీనే ఎంచుకుంది. దాన్ని ప్రస్తుత శివసేన ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కార్‌షెడ్‌ను తరలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర- రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని