రైతుల నిరసనలు: రాష్ట్రపతిని కలవనున్న పవార్
కేంద్ర తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 11 రోజులుగా రైతులు చేస్తున్న నిరసనలపై ఎన్సీపీ అధినేత శరద్పవార్ స్పందించారు. ఈ విషయమై డిసెంబర్ 9న ఆయన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనున్నట్లు ఆ పార్టీ తెలిపింది.
ముంబయి: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 11 రోజులుగా రైతులు చేస్తున్న నిరసనలపై ఎన్సీపీ అధినేత శరద్పవార్ స్పందించారు. ఈ విషయమై డిసెంబర్ 9న ఆయన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు ఎన్సీపీ ప్రతినిధి మహేష్ తపసే ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘రైతుల నిరసనల నేపథ్యంలో డిసెంబర్ 9న రాష్ట్రపతిని కలిసేందుకు ఎన్సీపీ అధినేత దిల్లీ వెళ్తున్నారు. అందులో భాగంగా ఆయన దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి రాష్ట్రపతికి వివరించనున్నారు. అంతేకాకుండా డిసెంబర్ 8న రైతు సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త బంద్కు సైతం ఎన్సీపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది’ అని ఆయన తెలిపారు.
దేశ రాజధాని సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తమ డిమాండ్లపై ఏకీభవించకపోవడంతో 11వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా డిసెంబర్ 8న దేశవ్యాప్త బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో రైతు సంఘాలు బంద్కు దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు సహా పలు ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఈ వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులను గత సెప్టెంబర్లో రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. ఎన్సీపీ నాయకులు ఆ బిల్లులకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా