చైనా టీకా: ఇప్పటికే 10లక్షల మందికి పంపిణీ!
చైనాలో ఇప్పటివరకు దాదాపు పదిలక్షల మందికి కరోనా టీకా ఇచ్చినట్లు చైనా నేషనల్ ఫార్మా గ్రూప్(సినోఫార్మ్) వెల్లడించింది.
తుదిదశ ప్రయోగాలు పూర్తికాకముందే..
అత్యవసర వినియోగం కింద భారీ సంఖ్యలో టీకాలు
బీజింగ్: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న వేళ..చైనా మాత్రం ఈ విషయంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు పదిలక్షల మందికి కరోనా టీకా ఇచ్చినట్లు చైనా నేషనల్ ఫార్మా గ్రూప్(సినోఫార్మ్) వెల్లడించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద భారీ ఎత్తున టీకా పంపిణీ చేపట్టినట్లు సినోఫార్మ్ తెలిపింది.
యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే టీకా కోసం విశ్వవ్యాప్తంగా ముమ్మర కృషి జరుగుతోంది. ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు తుది ప్రయోగదశకు చేరుకున్నాయి. చైనాలోనూ మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్లో నిమగ్నమయ్యాయి. ఇలా ప్రయోగాలు కొనసాగుతున్న సమయంలోనే అత్యవసర వినియోగం కింద అత్యవసర పనులకు వెళ్లే వారితోపాటు మరికొన్ని గ్రూపులకు ప్రయోగ టీకాలను అందిస్తోంది. జులై నెలలోనే ప్రారంభించిన ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు పదిలక్షల మందికి టీకా ఇచ్చినట్లు సినోఫార్మ్ వెల్లడించింది.
అయితే, ప్రయోగదశలో ఉన్న వ్యాక్సిన్ సమర్థత, సురక్షితంపై పూర్తిస్థాయి సమాచారం లేకుండానే భారీస్థాయిలో టీకా పంపిణీ చేపట్టడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా దీనిపై సినోఫార్మ్ స్పందించింది. తుది దశ ప్రయోగాలు పూర్తికానప్పటికీ, అత్యవసర వినియోగం కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరికీ తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తలేదని సినోఫార్మ్ ఛైర్మన్ లియూ జింగ్సేన్ అభిప్రాయపడ్డారు.
మూడోదశ క్లినికల్ ట్రయల్స్లో ఉన్న ఈ వ్యాక్సిన్లను దాదాపు 60వేల మంది వాలంటీర్లపై ప్రయోగిస్తున్నట్లు సినోఫార్మ్ తెలిపింది. వీరికి టీకాలను రెండు డోసుల్లో ఇస్తున్నారు. ఇలా ఇప్పటివరకు రెండో డోసు తీసుకున్న 40వేల మందికిపైగా రక్త నమూనాలను సేకరించినట్లు సినోఫార్మ్ ఛైర్మన్ వెల్లడించారు. టీకా తీసుకున్న అనంతరం విదేశాలకు వెళ్లిన నిర్మాణ సంస్థల ఉద్యోగులు, దౌత్యాధికారులు, విద్యార్థులు ఎవ్వరు కూడా వైరస్ బారినపడలేదని ఆయన స్పష్టంచేశారు.
చైనా నేషనల్ బయోటెక్ గ్రూపునకు చెందిన సినోఫార్మ్ ఇప్పటికే రెండు వ్యాక్సిన్లను అభివృద్ధిచేసింది. ఇక మరో సంస్థ సినోవాక్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్ను కూడా అత్యవసర వినియోగం కింద చైనాలో పంపిణీ చేస్తున్నారు. అయితే, టీకా ప్రభావాన్ని అంచనా వేసే ప్రయోగ ఫలితాల సమాచారం లేకుండానే అత్యవసర వినియోగం కింద భారీస్థాయిలో టీకా పంపిణీ చేయడంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా