J&Kలో జవానును అపహరించిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ నిన్నటి నుంచి కనిపించడంలేదని భారత సైన్యం తెలిపింది. షోఫియాన్ జిల్లాలోని హర్మైన్ ప్రాంతంలో నివసించే...
దిల్లీ: జమ్ముకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ నిన్నటి నుంచి కనిపించడంలేదని భారత సైన్యం తెలిపింది. షోఫియాన్ జిల్లాలోని హర్మైన్ ప్రాంతంలో నివసించే షాకిర్ మన్జూర్ అనే జవాను ఆచూకీ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి తెలియరావడంలేదని వెల్లడించారు. ఇతను 162 బెటాలియన్లో రైఫిల్ మెన్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులే అతణ్ని కిడ్నాప్ చేసి ఉంటారని జమ్మూ-కశ్మీర్ పోలీసులు, సైన్యం అనుమానిస్తున్నాయి. జవాను ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, సైన్యం కలిసి ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు జమ్మూ-కశ్మీర్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
‘‘162 బెటాలియన్ (టీఏ)కు చెందిన రైఫిల్ మెన్ షాకిర్ మన్జూర్ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కనపడటంలేదు. కాలిపోయిన అతడి కారును కుల్గాం సమీపంలో కనుగొన్నాం. ఉగ్రవాదులే అతణ్ని అపహరించి ఉంటారని అనుమానిస్తున్నాం. అతని ఆచూకీ కనుగోనేందుకు భద్రతా బలగాలు వెతుకుతున్నాయి’’ అని టెర్రరిజంఫ్రీకశ్మీర్ అనే హ్యాష్ ట్యాగ్ను జోడించి భారత్ సైన్యం చినార్ కార్ప్స్ విభాగం ట్వీట్ చేసింది. గతంలో షోపియాన్ జిల్లాకు చెందిన ఔరంగజేబ్ అనే జవానును ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఉగ్రవాదులు షాకిర్ను అపహరించి ఉంటారిని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!