గోవాలో సైకిల్‌పై సోనియాగాంధీ

దిల్లీలో వాయు కాలుష్యం కారణంగా గోవాలో ఉంటున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె వ్యాయామాలతోపాటు సైక్లింగ్‌ కూడా చేస్తున్నారు...

Published : 26 Nov 2020 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలో వాయుకాలుష్యం కారణంగా గోవాలో ఉంటున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె వ్యాయామాలతోపాటు సైక్లింగ్‌ కూడా చేస్తున్నారు. గోవాలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌ ఆవరణలో సోనియాగాంధీ సైకిల్‌ తొక్కుతూ కనిపించారు. సైక్లింగ్‌తో పాటు జాగింగ్‌ చేశారు.  కాంగ్రెస్ అధినేత్రి.. దిల్లీలో కాలుష్యం కారణంగా మరిన్ని సమస్యలు రాకుండా తాత్కాలికంగా గోవాలో ఉంటున్నారు.

దీర్ఘకాలంగా ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియాగాంధీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు.  ప్రస్తుతం ఆమె వయసు 73 సంవత్సరాలు. దిల్లీలో వాయుకాలుష్యం అధికం కావడంతో వైద్యుల సూచన మేరకు స్వస్థత కోసం ఆమె గోవాలో ఉంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని