పార్లమెంట్‌ సమావేశాలు:  స్పీకర్‌ సమీక్ష

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నిర్వహణ దాదాపు ఖాయమైంది. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు సమావేశాలు....

Updated : 27 Aug 2020 16:58 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నిర్వహణ దాదాపు ఖాయమైంది. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సన్నాహాలు వేగవంతం చేశారు. భద్రత, సామాజిక దూరం పాటించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించారు. పార్లమెంట్‌ సెక్యూరిటీ, సీపీడబ్ల్యూడీ, ఎన్‌డీఎంసీ, ఉభయసభల సెక్రెటరీ జనరల్స్‌, పార్లమెంట్‌ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ నుంచి సభ్యులను, సిబ్బందిని రక్షించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, మార్గదర్శకాలపై చర్చించారు. ప్రవేశ ద్వారాల వద్ద, పార్లమెంట్‌ భవనం లోపల, ఆవరణలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

మరోవైపు కొవిడ్‌ నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరం ఉండేలా సీట్లను సర్దుబాటు చేస్తున్నారు. రాజ్యసభ సమావేశాలకు రెండు ఛాంబర్లతో పాటు, గ్యాలరీని ఉపయోగించుకోనున్నారు. 60 మంది ఎంపీలు ఛాంబర్లో, 51 మంది గ్యాలరీల్లో, మిగిలిన 132 మంది లోక్‌సభ హాల్లో కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోక్‌సభలోనూ ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని