రైతుల ఆందోళనలకు పరిష్కారం చూపాలి

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలపై భాజపా నేతలు కించపరిచే వ్యాఖ్యలు చేయడంపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మండిపడ్డారు.  రైతులను కించపరిచేలా వారు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమంటూ తీవ్రంగా ఖండించారు.

Updated : 14 Dec 2020 23:38 IST

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌

జైపుర‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలపై భాజపా నేతలు కించపరిచే వ్యాఖ్యలు చేయడంపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మండిపడ్డారు.  రైతులను కించపరిచేలా వారు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమంటూ తీవ్రంగా ఖండించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం త్వరగా స్పందించి పరిష్కారం చూపాలంటూ ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. 

‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతుల పట్ల భాజపా నాయకులు కించ పరిచే వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా దురదృష్టకరం. రైతుల్ని దేశ ద్రోహులతో పోల్చడానికి బదులుగా.. ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ డిమాండ్ల పరిష్కారం దిశగా కృషి చేయాలి. రైతులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వ్యవహరించడం ఆందోళన కలుగజేస్తోంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనం చేకూర్చవు. వాటిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని గహ్లోత్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని