పిజ్జా తింటే వార్తగా నిలుస్తుందా?
రైతులు పిజ్జా తినటంపై కొంతమంది విమర్శలు చేశారు. ఈ వైఖరిపై పలువురు నిరసన వ్యక్తం చేశారు.
దిల్లీ ప్రదర్శనకారులకు వెల్లువెత్తిన మద్దతు
ఇంటర్నెట్ డెస్క్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల రైతులు దిల్లీ శివార్లలో నిరవధిక నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, ఆందోళనకారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఆందోళన గత 19 రోజులుగా కొనసాగుతోంది. అతి శీతల వాతావరణంలో బహిరంగ నిరసనలో పాల్గొంటున్న వీరికి పలువురు సహాయంగా నిలుస్తున్నారు. వీరికి అవసరమైన ఏర్పాట్లను, వస్తువులను అందచేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దాతలు రైతులకు పిజ్జాలను పంచారు. అయితే రైతులు పిజ్జా తినటంపై కొంతమంది విమర్శలు చేశారు. ఈ వైఖరిపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, గాయకుడు దిల్జీజ్ దొసాంజ్ రైతులకు మద్దతు పలికారు. ‘‘వ్యవసాయదారులు విషం తింటే ఎవరికీ ఆందోళన లేదు.. కానీ వారు పిజ్జా తింటే అది వార్తగా నిలుస్తుంది!’’ అని ఉన్న ఓ చిత్రాన్ని ఆయన ట్వీట్ చేశారు.
పిజ్జాకు గోధుమలు అందించేది వారే..
షాన్బీర్ సింగ్ సంధూ అనే యువకుడు, నలుగురు స్నేహితులతో కలిసి గతవారం ‘పిజ్జా లంగర్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 400కు పైగా పిజ్జాలను నిరసన కారులకు అందచేశారు. రైతుల కోసం పప్పు, చపాతీలతో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేసేందుకు చాలినంత సమయం లేకపోవటంతో తమకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన వివరించారు. పిజ్జా తయారీకి కావాల్సిన గోధుమలను అందించే రైతులు.. పిజ్జాను ఎందుకు తినకూడదంటూ షాన్బీర్ సింగ్ ప్రశ్నించారు. గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న తాను కూడా వ్యవసాయదారుడినే అని ఆయన తెలిపారు.
వెల్లువెత్తుతున్న మద్దతు
తాము మరోసారి మరింత పెద్ద అన్నదాన లంగర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఆ యువకులు ప్రకటించారు. ఈసారి దానిలో పిజ్జా, బర్గర్ లాంటివి మరెన్నో పంచిపెడతామని వారు వివరించారు. నిరసన చేస్తున్న వేలాది రైతులకు సహాయం చేసేందుకు భారీగా దాతలు ముందుకొస్తున్నారు. వారికి ఆహారం, నిద్రపోయేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గంటలో 1500 నుంచి 2000 చపాతీలను తయారు చేయగల యంత్రాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. ‘ఖల్సా ఎయిడ్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వారికోసం కాళ్లను మర్దన చేసే (ఫుట్ మాసేజ్) యంత్రాలను ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప