దిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలివ్వండి: సుప్రీం
హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పంట వ్యర్థాల దహనాల నివారణ పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలో అత్యు్న్నత న్యాయయస్థానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి అవసరమైన సహకారం అందించాలని మూడు రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల దహనాలు...
పంటల వ్యర్థాల దహనంపై కమిటీ ఏర్పాటు
దిల్లీ: హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పంట వ్యర్థాల దహనాల నివారణ పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలో అత్యున్నత న్యాయయస్థానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి అవసరమైన సహకారం అందించాలని మూడు రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాల వినియోగం సరైనదేనని సుప్రీం అభిప్రాయపడింది. 15 రోజులకోసారి లేదా అవసరమైనప్పుడు కమిటీ నివేదిక అందించాలని సుప్రీం కోర్టు కోరింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే మాట్లాడుతూ.. దిల్లీ-ఎన్సీఆర్ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలగాలి అని వ్యాఖ్యానించారు. గాలి కాలుష్య కారక పంటవ్యర్థాల దహనాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్రాలు పని చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది.
గత కొన్నేళ్లుగా దిల్లీ పరిసరాల్లో గాలి కాలుష్యం కావడానికి చుట్టుపక్కలున్న హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్లో పంటవ్యర్థాల దహనమే కారణమని.. దీనికి నివారణ చర్యలుతీసుకోవాల్సిందిగా సుప్రీంలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే దీనిపై కమిటీని వేయడాన్ని కేంద్రం వ్యతిరేకించింది. ఇప్పటికే ఈ అంశాన్ని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ (ఈపీసీఏ) పరిశీలిస్తోందని కోర్టుకు తెలిపింది. అమికస్ క్యూరీని కూడా ఏర్పాటు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు వివరించారు. మరోవైపు దిల్లీలో వాయు కాలుష్యానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నామని పంజాబ్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
అయితే ఈ మూడు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడం వల్లే దిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోతోందని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) తన నివేదికలో పేర్కొంది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా విద్యుత్ జనరేట్ల వాడకాన్ని కూడా దిల్లీ ప్రభుత్వం నిషేధించింది. వాయు కాలుష్యంతో దిల్లీ ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతుండటంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సచివాలయ ప్రాంగణంలో ‘ గ్రీన్ వార్ రూం’ను ప్రారంభించారు. ఇక్కడ దిల్లీ పరిసర రాష్ట్రాల్లో జరుగుతున్న పంటల వ్యర్ధాల దహన ప్రక్రియను శాటిలైట్ ద్వారా పరిశీలించే అవకాశముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు