కరోనాతో తమిళనాడు మంత్రి మృతి

కరోనా బారిపడి చికిత్స పొందుతూ తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దొరైక్కన్ను....

Updated : 01 Nov 2020 13:29 IST

తమిళనాడు: కరోనా బారిపడి చికిత్స పొందుతూ తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దొరైక్కన్ను(72) కన్నుమూశారు. ఈ నెల 13న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటనే ఆయనను విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కావేరీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి 11.15 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. 1948లో తంజావూరు జిల్లా రాజగిరిలో దొరైక్కన్ను జన్మించారు. 3 సార్లు పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లో ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దొరైక్కన్నుకు భార్య, నలుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని