ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే.. జైలుకే!

ఆన్‌లైన్‌ రమ్మీపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకనుంచి రమ్మీ ఆడితే ఆరు నెలలపాటు జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించనున్నట్టు తెలిపింది......

Published : 21 Nov 2020 01:56 IST

ఆన్‌లైన్‌ రమ్మీపై తమిళనాడు నిషేధం

చెన్నై: ఆన్‌లైన్‌ రమ్మీపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకనుంచి రమ్మీ ఆడితే ఆరు నెలలపాటు జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించనున్నట్టు తెలిపింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ హౌస్‌ నడిపితే రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఆటలో డబ్బు కోల్పోయిన  అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ శుక్రవారం ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. 

ఆన్‌లైన్‌ రమ్మీకి ప్రచారం చేసినందుకు ఇటీవల క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, సౌరభ్‌ గంగూలీ, నటులు ప్రకాష్‌రాజ్‌, సుదీప్‌, రానా, తమన్నాలకు మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ సమాధానం చెప్పాలని ఆదేశించింది. మదురైకి చెందిన మహ్మద్‌ రజ్వీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం.. ఆట కోసం ప్రచారం చేస్తున్న ప్రముఖులు.. ప్రజా శ్రేయస్సును విస్మరిస్తూ స్వలాభంపైనే దృష్టి సారిస్తున్నారని పేర్కొంది. క్రికెట్‌ విషయంలోనూ రాష్ట్రాల పేర్లు ఉపయోగిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, వారి మనోభావాలతో ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని