నెలలో 19లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి: తేజస్వీ
బిహార్లో ఎన్డీయే సర్కారు హామీ ఇచ్చిన విధంగా మొదటి నెలలో 19లక్షల ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
పట్నా: బిహార్లో ఎన్డీయే సర్కారు హామీ ఇచ్చిన విధంగా మొదటి నెలలో 19లక్షల ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘బిహార్ దేశంలో నిరుద్యోగుల రాజధానిగా తయారైంది. ఉద్యోగాల కోసం ప్రజలు ఎక్కువ కాలం ఎదురుచూడలేదు. ఎన్డీయే సర్కారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి నెలలోపు 19లక్షల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయకపోతే.. మేం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, నీటిపారుదల సమస్యలపై 1.56కోట్ల మంది ఓటర్లు మాపై విశ్వాసం ఉంచారు. వారి నమ్మకాల్ని మేం వమ్ము చేయం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే తప్పనిసరిగా మేం ఆ సమస్యలపై ఉద్యమిస్తాం’ అని తేజస్వీ తెలిపారు.
ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ను ఉద్దేశిస్తూ.. ‘రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీకి చెందిన వ్యక్తి సీఎం పదవి చేపట్టడం ఇప్పుడే తొలిసారి చూస్తున్నా. నీతీశ్కుమార్ కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఆయన విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారు. నేను ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టకముందే అధికార పార్టీ సభ్యులు నన్ను రాజీనామా చేయాలని కోరుతున్నారు. నేను ఉపముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టా.. అప్పట్లో మరి నాపై ఏవైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయేమో నిరూపించాలి’ అని తేజస్వీ తీవ్ర విమర్శలు చేశారు.
బిహార్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాలు గెలిచి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నవంబర్ 16న సీఎంగా నీతీశ్కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా 74, జేడీయూ 46 గెలవగా.. ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ 75 స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?