One Nation One election: కేంద్రం పరిశీలనలో జమిలి ఎన్నికలు
లా కమిషన్ సిఫార్సులను అధ్యయనం చేస్తున్నాం
న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఈనాడు, దిల్లీ: దేశంలో 2014-19 మధ్యకాలంలో జరిగిన 38 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,814 కోట్ల నిధులు విడుదల చేసిందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో అన్ని ఎన్నికలనూ ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లు చెప్పారు. బుధవారం లోక్సభలో ప్రదీప్కుమార్ సింగ్ అనే సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘ఎన్నికలు తరచూ జరగడం వల్ల సాధారణ ప్రజాజీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు వారికి అందే అత్యవసర సేవలపైనా ప్రభావం పడుతోంది. అన్ని ఎన్నికలూ ఏకకాలంలో జరిపితే ఏటేటా వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుందని న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 79వ నివేదికలో పేర్కొంది. ఎన్నికల సంఘంతో సహా వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించి తగు సిఫార్సులు చేసింది. ఆ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించి జమిలి ఎన్నికలపై ఆచరణాత్మక మార్గసూచిక, నిబంధనలు రూపొందించాలని సూచిస్తూ లా కమిషన్కు పంపాం. విభిన్న వర్గాలతో సంప్రదించిన అనంతరం ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ 244, 255 నివేదికల్లో సిఫార్సులు చేసింది. ఇవి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి’ అని కిరణ్ రిజిజు తెలిపారు.
* ప్రామాణిక నిబంధనల ప్రకారం లోక్సభ ఎన్నికల పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర అసెంబ్లీలకు స్వతంత్రంగా జరిగే ఎన్నికల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరిగితే మాత్రం ఆయా రాష్ట్రాల్లో అయ్యే ఎన్నికల వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50% చొప్పున పంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా గత ఆరేళ్లలో కేంద్రం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.5,814 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించారు.
ఆధార్-ఓటరు కార్డు అనుసంధానం
నకిలీ ఓటర్లను అరికట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటరుకార్డు-ఆధార్లను అనుసంధానం చేయాలని ప్రతిపాదించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని బుధవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘నేరాభియోగాలు నమోదైన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించడం, వ్యయ నియంత్రణ, ఒపీనియన్ పోల్స్, చెల్లింపు వార్తలపై నిషేధం లాంటి ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ రెండు నివేదికలు ఇచ్చింది. ఒకే వ్యక్తి విభిన్న ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది’’ అని పేర్కొన్నారు.
కేంద్రం విడుదల చేసిన ఎన్నికల నిధులు
సంవత్సరం ఖర్చు (రూ.కోట్లలో)
2014-15 510.00
2015-16 1,490.16
2016-17 356.14
2017-18 1,199.85
2018-19 886.11
2019-20 1,372.03
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ఈటల సమక్షంలో భాజపాలో చేరిన సినీనటుడు సంజయ్ రాయిచుర
-
Politics News
BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
-
Sports News
Ross Taylor : ఆ మ్యాచ్లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
-
Movies News
social look: ‘మిస్బి’గా తమన్నా.. నిఖిల్ రిక్వెస్ట్.. శునకానికి సోనూ ట్రైనింగ్..
-
India News
DGCA: విమానాలకు పక్షుల ముప్పు! డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ
-
Politics News
KTR: ఉచిత పథకాలన్నీ రద్దు చేసి వచ్చే ఎన్నికలకు వెళ్తారా?: మోదీని ప్రశ్నించిన కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్లో మూడు సంచలన క్యాచ్లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు