Kidney Disease: కిడ్నీ వ్యాధికి ఆయుర్వేద విరుగుడు
పలు రకాల మూలికలతో కూడిన ఆయుర్వేద ఔషధం ‘నీరి-కేఎఫ్టీ’తో మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు
నీరి-కేఎఫ్టీతో ఉపశమనం
అధ్యయనంలో వెల్లడి
దిల్లీ: పలు రకాల మూలికలతో కూడిన ఆయుర్వేద ఔషధం ‘నీరి-కేఎఫ్టీ’తో మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు ప్రయోజనం కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. ఇది దీర్ఘకాల కిడ్నీ రుగ్మత ఉద్ధృతిని నెమ్మదింపచేయడమే కాకుండా ఈ అవయవం మునుపటిలా ఆరోగ్యంగా పనిచేసేందుకూ వీలు కల్పిస్తుందని వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ‘సౌదీ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్’లో ప్రచురితమయ్యాయి. భారత్కు చెందిన ఏఐఎంఐఎల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ నీరి-కేఎఫ్టీని ఉత్పత్తి చేస్తోంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) అనే దీర్ఘకాల రుగ్మతపై దీని ప్రభావాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ మందు.. ఆక్సిడేటివ్, ఇన్ఫ్లమేటరీ ఒత్తిడి వల్ల కణాలు మృతి చెందడాన్ని నిలువరిస్తుందని గుర్తించారు.
ఔషధాల కారణంగా మూత్రపిండాల్లో తలెత్తే విషతుల్యతను తగ్గించడం, రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం, యాంటీఆక్సిడెంట్లను విడుదల చేయడం ద్వారా ఇలాంటి ఫలితాన్ని అందిస్తుందని తేల్చారు. సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, సీరం యూరిక్ యాసిడ్ వంటి వాటి స్థాయినీ ఈ ఔషధం తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. పరీక్షార్థుల్లో దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని చెప్పారు. మూత్రపిండాలు పూర్తి స్థాయిలో విఫలమై, తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సిన వారికి ప్రత్యామ్నాయ, అనుబంధ చికిత్సగా నీరి-కేఎఫ్టీని సూచించవచ్చని పేర్కొన్నారు. ఈ ఔషధంలో ఉన్న 20కిపైగా మూలికల వల్ల ఈ ప్రభావం కలుగుతోందని ఏఐఎంఐఎల్ ఎండీ కె.కె.శర్మ తెలిపారు. ఈ మందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యుడు కె.ఎన్.ద్వివేది పేర్కొన్నారు. వీటివల్ల మూత్రపిండాలకే కాక కాలేయానికీ ప్రయోజనం కలుగుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!