Rajkundra: కుంద్రా.. అశ్లీల కథాచిత్రమ్
ఆశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో సోమవారం అరెస్టయిన వ్యాపార వేత్త, ప్రముఖ బాలీవుడ్ నటి
ఐపీఎల్ బెట్టింగ్ నుంచి పోర్న్ యాప్ల వరకు
ముంబయి: అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో సోమవారం అరెస్టయిన వ్యాపార వేత్త, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు వివాదాలు కొత్త కాదు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నుంచి ఆరంభిస్తే, దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్ మిర్చితో సన్నిహిత సంబంధాల వరకు ఎప్పుడూ ఏదో వివాదం ఆయన్ను వెన్నాడుతూనే ఉంది.
రాజ్కుంద్రా.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొకొచ్చేది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. ఈ లండన్ వ్యాపారవేత్త 2009లో శిల్పను వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్లో పెట్టుబడులు పెట్టారు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో కుంద్రా చీకటి నేపథ్యం వెలుగులోకి వచ్చింది. ఆ కుంభకోణంలో కుంద్రాపై బెట్టింగ్, ఫిక్సింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. గంటల తరబడి దిల్లీ పోలీసులు కుంద్రాను విచారించారు. ఈ సందర్భంగా తాను బెట్టింగ్లకు పాల్పడినట్లు కుంద్రా అంగీకరించారు. ఏడుగురు బుకీలతో సంప్రదింపులు జరిపానని, మ్యాచ్లు మాత్రం ఫిక్స్ చేయలేదని పేర్కొన్నారు. దీంతో 2015లో బీసీసీఐ... కుంద్రాను శాశ్వతంగా ఐపీఎల్ నుంచి వెలివేసింది.
అయినా క్రీడల్లో కుంద్రా భారీగా పెట్టుబడులు పెడుతూనే వచ్చారు. బాలీవుడ్ నటుడు సంజయ్దత్ భాగస్వామ్యంతో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లీగ్ను, తర్వాత ఐపీఎల్ పేరుతో ఇండియన్ పోకర్ లీగ్ను ప్రారంభించారు. బెస్ట్ డీల్ టీవీ పేరుతో ఓ టెలీ షాపింగ్ ఛానల్ కూడా ఉంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు వాటాలు ఉన్నాయి. 2018లో బిట్కాయిన్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కుంద్రాను ప్రశ్నించింది. రియల్ ఎస్టేట్ కుంభకోణంలో దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్ మిర్చితో సంబంధాలపై కూడా కుంద్రాను విచారించారు. దాదాపు తొమ్మిది గంటలు ప్రశ్నించారు. ఇలా వివాదాలు వస్తున్నా.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చిన కుంద్రా రెండేళ్ల క్రితం అశ్లీల చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. హాట్షాట్స్ యాప్లో తన సినిమాలను ప్రసారం చేయడం ప్రారంభించారు. అయితే.. హాట్షాట్స్ కాకుండా చాలా అశ్లీల యాప్లను కుంద్రా నిర్వహిస్తున్నారని పోలీసుల ఆరోపణ.
ఆ షూటింగే పట్టిచ్చింది
నిజానికి రాజ్కుంద్రాను ముంబయి పోలీసులు సోమవారం అరెస్టు చేసినా, ఐదు నెలల నుంచి అతనిపై నిఘా ఉంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలాడ్ వెస్ట్లోని ఓ బంగ్లాపై దాడి సమయంలో కుంద్రా పేరు పోలీసుల దృష్టికి వచ్చింది. దాడి సమయంలో బంగ్లాలో ఓ అశ్లీల చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్టు చేశారు. విచారణ సందర్భంగా అశ్లీల చిత్రాల రాకెట్తో రాజ్కుంద్రాకు సంబంధం ఉందని పోలీసులకు తెలిసింది. అయితే బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో అప్పుడు అరెస్టు చేయలేదు.
అది అశ్లీలం కాదు: గహనా
రాజ్కుంద్రా సంస్థలో మూడు సినిమాల్లో నటించిన నటి గహనా వశిష్ఠ్ రాజ్కుంద్రాకు మద్దతుగా నిలిచారు. తాము అశ్లీల చిత్రాలు తీయలేదని, తాము తీసిన చిత్రాలు ఆ విభాగంలోకి రావని, పోలీసులే అక్రమంగా కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. ఫిబ్రవరిలో మలాడ్ వెస్ట్లో పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో గహనా కూడా ఉన్నారు. ఇటీవల ఆమె బెయిల్పై విడుదలయ్యారు.
వీడియో ఆడిషన్లో దుస్తులు విప్పమన్నారు: మోడల్ సాగరిక
రాజ్కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా మోడల్ సాగరికా సుమన్.. రాజ్కుంద్రాపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘గత ఏడాది ఆగస్టులో కామత్ ఫోన్ చేశారు. శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా భారీస్థాయిలో వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారని.. అందులో నటించేందుకు ఆడిషన్ ఇవ్వాలని కోరారు. వీడియోలో ఆడిషన్ ఇస్తే సరిపోతుందన్నారు. ఆడిషన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్లో ఉమేశ్ కామత్తో పాటు రాజ్కుంద్రా, మరో వ్యక్తి ఉన్నారు. ఆడిషన్ సందర్భంగా కామత్.. నన్ను దుస్తులు విప్పమన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. అసభ్యంగా మాట్లాడారు. తమ వెబ్సిరీస్లో నటిస్తే పేరు, డబ్బు వస్తుందని ఆశ చూపారు. అయినా ఆ ప్రతిపాదనను తిరస్కరించాను. నాలా మరో మహిళ బలికాకూడదనే ఇప్పుడు రాజ్కుంద్రాకు వ్యతిరేకంగా గళమెత్తాను’’ అని సాగరిక చెప్పారు.
కుంద్రా.. ప్లాన్-బి
కుంద్రా తన అశ్లీల చిత్రాలను ‘హాట్షాట్స్’ యాప్ వేదిగ్గా ప్రసారం చేశారు. అయితే అది కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతో గూగుల్ ప్లే స్టోర్.. నోటీసులు పంపింది. ఈ విషయంపై కుంద్రాకు, అతని సహచరులకు మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో యాప్ను నిషేధించినా బెంగపడాల్సినదేమీలేదని.. తనకు ప్లాన్-బి ఉందని తెలిపారు. ఇంకో యాప్ నుంచి అశ్లీల కంటెంట్ ప్రసారం అవుతుందని సహచరులకు భరోసా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!