Xi Jin ping: జీవితకాల అధినాయకుడిగా జిన్పింగ్!
చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మూడోసారీ అధ్యక్ష పగ్గాలను చేపట్టనున్నారా..?
మూడోసారీ ఆయనకే అధ్యక్ష పగ్గాలు
ప్రారంభమైన పార్టీ కీలక ప్లీనరీ సమావేశాలు
చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మూడోసారీ అధ్యక్ష పగ్గాలను చేపట్టనున్నారా..? జీవితకాలం డ్రాగన్ దేశానికి ఆయనే అధినేతగా ఉండనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న జిన్పింగ్.. తన అధికారాన్ని శాశ్వతం చేసుకొనే దిశగా పావులు కదుపుతున్నారు.
బీజింగ్: చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సోమవారం నుంచి బీజింగ్లో జరుపుకొంటున్న నాలుగు రోజుల ప్లీనరీ సమావేశం పార్టీ నూరేళ్ల చరిత్రలో అరుదైన ‘చరిత్రాత్మక తీర్మానాన్ని’ ఆమోదించి, షీ జిన్పింగ్ మూడోసారి దేశాధ్యక్షుడిగా కొనసాగడానికి పచ్చజెండా ఊపనున్నది. ఈ సమావేశాల్లో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్టీ మహాసభలు సాధికారంగా జిన్పింగ్ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తన నూరేళ్ల చరిత్రలో ఇంతవరకు రెండే రెండు చరిత్రాత్మక తీర్మానాలు చేసింది. ఈసారి ఆమోదించేది మూడో తీర్మానమవుతుంది. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి, చరిత్ర గతిని మార్చడానికి చరిత్రాత్మక తీర్మానాలు చేస్తారు. వాటికి అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉంది. 2022లో జరిగే పార్టీ మహాసభలు మూడోసారి జిన్పింగ్ నాయకత్వానికి సాధికారంగా ఆమోద ముద్ర వేసినా, ఆయన వారసుడెవరో తేల్చకుండా వదిలేస్తాయని నిపుణుల అంచనా. దీన్ని బట్టి జిన్పింగ్ జీవితకాల అధినాయకుడిగా కొనసాగడమో, లేదా 2027లో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడమో జరుగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పట్లో ఆయనకు రాజకీయ వారసుడెవరూ ఆవిర్భవించే అవకాశాలు కనిపించడం లేదు.
అన్నింటికీ మినహాయింపు
మరోవైపు చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ తోపాటు అనేకమంది ఉన్నత స్థాయి నాయకులు రెండు పదవీ కాలాలు పూర్తి చేసుకున్న తరవాత పదవీ విరమణ చేస్తారని అంచనా. ఉన్నత నాయకులెవరూ రెండు సార్లకు మించి పదవిలో కొనసాగకూడదనీ, 68 ఏళ్లు నిండిన తరవాత రిటైరైపోవలసిందేనని కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్ తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్ జియవోపింగ్ నిర్దేశించారు. దీనికి 68 ఏళ్ల జిన్పింగ్ మినహాయింపుగా నిలుస్తున్నారు. దేశాధ్యక్షునికి రెండు పర్యాయాల పదవీకాల పరిమితి వర్తించదని 2018నాటి కీలక రాజ్యాంగ సవరణ స్పష్టం చేయడమే దీనికి కారణం. మరోవైపు, పార్టీలో శక్తిమంతమైన పొలిట్ బ్యూరోలోని 25 మంది సభ్యుల్లో దాదాపు సగం మందికి వచ్చే ఏడాది అక్టోబరుకల్లా 68 ఏళ్లు నిండుతాయి. మరి వారి భవితవ్యం ఏమిటో తెలియదు.
అధికారాలన్నీ జిన్పింగ్ చేతుల్లోనే
జిన్పింగ్ చైనాలోని మూడు అధికార కేంద్రాలకూ నాయకుడిగా కొనసాగుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా సాయుధ దళాల అధిష్టానమైన కేంద్ర మిలిటరీ కమిషన్ చైర్మన్గా, దేశాధ్యక్షుడిగా తనే చక్రం తిప్పుతున్నారు. గడచిన తొమ్మిదేళ్ల పదవీ కాలంలో జిన్పింగ్, చైనా కమ్యూనిస్టు అధినాయకుడు మావో జెడాంగ్ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడిగా ఆవిర్భవించారు. మావో తరవాత జిన్పింగ్ను 2016లో కీలక నాయకుడిగా ప్రకటించి. పార్టీ రాజ్యాంగంలో ఆ అంశాన్ని పొందుపరిచారు. ‘ఇది పార్టీకీ, దేశానికీ, చైనా ప్రజలకు పెద్ద వరం’ అని కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ కొనియాడింది. 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైనప్పటి నుంచి జిన్పింగ్ చైనాను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దారనీ, ఆయన నాయకత్వంలో చైనా నవ బలాధిక్య యుగంలో ప్రవేశిస్తోందనీ, చరిత్ర గతిని మార్చే కీలక నాయకుడిగా ఆయన చరితార్ధుడయ్యారనీ అధికార వార్తా సంస్థ కీర్తించింది. కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశంలో చర్చించడానికి పొలిట్ బ్యూరో సమర్పించిన అధికార ప్రకటన చైనా కమ్యూనిస్టు పార్టీ తన వందేళ్ల చరిత్రలో సాధించిన విజయాలనూ, జిన్పింగ్ నాయకత్వంలో సాధించిన పురోగతినీ ఏకరవు పెట్టింది. చైనా అంతర్జాతీయంగా తన హోదాను ఇనుమడింపజేసుకుందని ఆ ప్రకటన ఉద్ఘాటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ