Hawk Eye app: ఫిర్యాదులపై డేగకన్ను.. సామాజిక మాధ్యమాల్లో దీనివైపే మొగ్గు
సామాజిక మాధ్యమాల వినియోగం విస్తృతమైన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు చేసేందుకూ ప్రజలు క్రమేపీ వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్..
నిత్యం సగటున 318 మంది వినియోగం
సామాజిక మాధ్యమాల వినియోగం విస్తృతమైన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు చేసేందుకూ ప్రజలు క్రమేపీ వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్.. లాంటి మాధ్యమాలున్నా.. వాటిని పక్కకు పెట్టి పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన ‘హాక్-ఐ’ యాప్లో ఫిర్యాదు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2020లో ఏకంగా 1,15,743 మంది ఈ యాప్ను వినియోగించారు. అంటే రోజుకు సగటున 318 మంది వినియోగిస్తున్నట్లు లెక్క. డయల్ 100 లేదా 112కు ఆ ఏడాది 12,42,680 మంది పలు అంశాలపై కాల్స్ చేశారు. 6,78,189 మంది పోలీస్స్టేషన్లకు నేరుగా వెళ్లి ఫిర్యాదులు చేశారు. సామాజిక మాధ్యమాలతో పోల్చితే మాత్రం హాక్-ఐ యాప్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తొలుత హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్ వేగంగా ఆదరణ పొందింది. 2020 చివరికల్లా రాష్ట్రవ్యాప్తంగా 29,82,076 మంది దీన్ని సెల్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్నట్లు పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ పరిశీలనలో తేలింది.
సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు ఇలా..
ఫేస్బుక్ 74,142
ట్విటర్ 57,396
వాట్సప్ 28,377
మొత్తం 1,59,915
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్