Temple mount: ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ వెనక..
పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండువైపులా రాకెట్లతో దాడులు జరుగుతున్నాయి.
పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండువైపులా రాకెట్లతో దాడులు జరుగుతున్నాయి. ఇది చినికిచినికి పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంతకూ... ఉన్నట్టుండి ఎందుకీ గొడవ? దేనికోసమీ యుద్ధ వాతావరణం..?
గొడవ ఎక్కడ?
• జెరూసలెంలోని అల్-అఖ్సా మసీదు ప్రాంగణంలో కొద్దిరోజుల కిందట పాలస్తీనా, ఇజ్రాయెల్ భధ్రతా దళాల మధ్య ఘర్షణతో ఈ గొడవ అందరి దృష్టిని ఆకర్షించింది. ఘర్షణంతా ఈ మసీదు, ప్రాంగణం గురించే! ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలెంలో ఉంటుందీ అల్-అఖ్సా మసీదు. మూడు మతాలకూ అత్యంత కీలకమైంది కాబట్టే జెరూసలెం పాతబస్తీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి, ప్రత్యేక రక్షణ కల్పించింది.
ఏంటీ అల్-అఖ్సా?
• అల్-అఖ్సా మసీదు ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి! సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ మసీదు, ప్రాంగణాన్ని ముస్లింలు హరామ్ అల్-షరీఫ్ (పవిత్ర స్థలం) అని పిలుచుకుంటారు. యూదులు ఈ ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్ (ఒకప్పుడు కొండగా ఉండేది)గా భావిస్తారు. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం... మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణం చేశారంటారు. సుమారు 5వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోవటానికి వీలైన ఈ మసీదును ఎనిమిదో శతాబ్దంలో నిర్మించారు. బంగారు పూతతో కూడిన రాతిచిప్పలాంటి కప్పు దీని ప్రత్యేకత. మసీదు, దాని ప్రాంగణమంతా పవిత్రమైందని భావిస్తూ... సెలవు రోజుల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటారు.
మరి యూదులకేంటి?
• యూదులకు టెంపుల్మౌంట్ అత్యంత పవిత్ర స్థలం. ఎందుకంటే ఒకప్పటి ఈ కొండపై రెండు పురాతన యూదు దేవాలయాలుండేవి. మొదటిదేమో బైబిల్ ప్రకారం- కింగ్ సాల్మన్ నిర్మించింది. ఆ తర్వాత బాబిలోనియన్లు దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై, 600 సంవత్సరాలున్న తర్వాత.. తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ దేవాలయం కడతారని... ఇక్కడింకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం.
యూదుల స్వాధీనంలో... జోర్డాన్ నిర్వహణలో!
• 1967లో జరిగిన అరబ్-ఇజ్రాయెల్ యుద్దంలో తూర్పు జెరూసలెంను జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలోనే జెరూసలెం పాతబస్తీ కూడా భాగం. ఆ తర్వాత జెరూసలెంను తమ రాజధానిగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. 1990లో కొంతమంది యూదు అతివాదులు కూల్చిన తమ దేవాలయాలను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా శంకుస్థాపన చేయటానికి ప్రయత్నించటంతో గొడవలు తీవ్రమయ్యాయి. 1994లో జోర్డాన్-ఇజ్రాయెల్ మధ్య ఓ శాంతి ఒప్పందం జరిగింది. దానిప్రకారం అల్-అఖ్సా మసీదు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలనుకున్నారు. జోర్డాన్ అధీనంలోని వక్ఫ్ అనే ఇస్లామిక్ ట్రస్టు మసీదు నిర్వహణను చూస్తోంది. ఇజ్రాయెల్ భద్రతా బలగాలు ఆ ప్రాంగణంలోనే ఉంటూ... వక్ఫ్ ట్రస్ట్తో సమన్వయం చేసుకుంటుంటారు. అయితే ఒప్పందంలో భాగంగా ప్రార్థనలకు ముస్లింలను అనుమతించినట్లు యూదులు, క్రిస్టియన్లను అనుమతించరు. వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లటానికి మాత్రమే అనుమతి ఉంది. (రాతికప్పు కింద పశ్చిమ భాగంలోని గోడ వద్ద యూదులు ప్రార్థనలు చేస్తారు. ఈ గోడ ఒకప్పుడు టెంపుల్మౌంట్లో భాగంగా ఉండేదని వారి నమ్మకం.)
అనుమతుల్లో వివక్షంటూ...
• ముస్లిమేతరులను ప్రార్థనలకు అనుమతించకుండా వివక్ష చూపుతున్నారంటూ చాలాకాలంగా సాగుతున్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారింది. ఇటీవలే ఇజ్రాయెల్ ‘జెరూసలెం డే’ అంటూ నిర్వహించిన సంబరాలు ఈ ఘర్షణలకు ఆజ్యం పోశాయి. జెరూసలెం పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ అధికారికంగా జెరూసలెం డేను నిర్వహించింది. తద్వారా తూర్పు జెరూసలెంలో నివసిస్తున్న పాలస్తీనా వాసులను రెచ్చగొట్టినట్లైంది. అధికారికంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం యధాతథ స్థితిని (ముస్లిమేతరులకు ప్రార్థనలకు అంగీకరించరు) కొనసాగిస్తామని ప్రకటించినా... ఇజ్రాయెల్లోని అనేక మతసంస్థలు తమకూ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో భారీసంఖ్యలో యూదులు ఈ ప్రాంతానికి వస్తుండటంపై జోర్డాన్ అధికారికంగా ఇజ్రాయెల్కు ఫిర్యాదు కూడా చేసింది. కొద్దివారాల కిందట జెరూసలెం పాతబస్తీలో యూదులు, పాలస్తీనీయుల మధ్య గొడవలు చెలరేగాయి. కొంతమంది పాలస్తీనీయులు యూదులపై దాడి చేశారు. ఫలితంగా... అతివాద యూదులు ఆగ్రహంతో వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ గొడవల నేపథ్యంలో పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో రంజాన్ ప్రార్థనలను కూడా ఇజ్రాయెల్ పోలీసులు నిషేధించారు. దీంతోపాటు... తూర్పు జెరూసలెంలోని కొన్ని ప్రాంతాల నుంచి పాలస్తీనీయులను ఖాళీ చేయించటానికి ఇజ్రాయెల్ బలగాలు ప్రయత్నించటంతో ఘర్షణలు తీవ్రమయ్యాయి. తమను ఖాళీ చేయించి యూదు నివాసాలు ఏర్పాటు చేయజూస్తున్నారనేది పాలస్తీనీయుల ఆరోపణ. వీటన్నింటి నేపథ్యంలో జెరూసలెం డేను ఇజ్రాయెల్ నిర్వహించటంతో ఘర్షణలు చెలరేగాయి. అల్-అఖ్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగటంతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. - ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!