కరోనా కాలంలో ఇదీ ‘బడి’!
ఇది కరోనా కాలం.. ఈ వైరస్ దెబ్బకు మనిషి జీవన ముఖచిత్రమే కాదు.. బడి స్వరూపమూ మారిపోయింది. ......
ఇంటర్నెట్ డెస్క్: ఇది కరోనా కాలం.. ఈ వైరస్ దెబ్బకు మనిషి జీవన ముఖచిత్రమే కాదు.. బడి స్వరూపమూ మారిపోయింది. విద్యా రంగానికి కొవిడ్ కొత్త పరీక్ష పెట్టింది. పరీక్షలు, కౌన్సెలింగ్లు, ప్రవేశాలతో హడావుడిగా సాగాల్సిన విలువైన సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మాస్క్లు, శానిటైజర్లు వైపు పరుగులు పెట్టేలా చేసింది. తమ పిల్లల చదువులు ఏమైపోతాయో అనే ఆందోళనను మిగిల్చింది. విద్యా ప్రణాళికతో పాటు బడులు స్వరూపాన్నే మార్చేసింది. ఈ మహమ్మారి కట్టడే లక్ష్యంగా విధించిన లాక్డౌన్ నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇందులో భాగంగా థాయ్లాండ్ ప్రభుత్వం తమ దేశంలోని పాఠశాలలను జులైలోనే ప్రారంభించింది. పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు పాటిస్తూ కొత్త సాధారణ పరిస్థితులను తీసుకొచ్చింది. ఇప్పటికైతే భౌతికదూరమే ఉత్తమ వ్యాక్సిన్ అని నిపుణులు హెచ్చరిస్తున్న బ్యాంకాక్ పాఠశాలల్లో తీసుకుంటున్న చర్యలేంటో చూద్దామా?
ఆటలంటే పిల్లలకు చాలా ఇష్టం. అంతా కలిసి ఒకేచోట కలిసిమెలిసి ఆడుకోవాలనుకుంటారు. కానీ, కరోనా భయం వెంటాడటంతో బ్యాంకాక్లోని ద వాట్ ఖ్లోంగ్ టాయ్ పాఠశాలలో భౌతికదూరం పాటించేలా పిల్లల కోసం ప్రత్యేక బాక్స్లను ఏర్పాటు చేశారు. దీంతో కేజీ చిన్నారులు మాస్క్లు కట్టుకొని ఎవరికి కేటాయించిన బాక్స్లో వారే బొమ్మలతో ఆడుకొంటున్నారిలా..
ఆటలాడే సమయంలో పిల్లలు ఒకచోట నిలవరు. ముసిముసి నవ్వులతో అటూఇటూ పరుగులు తీస్తారు. అలాంటి చిన్నారులకు ఒక గీత గీసి అందులోనే కదలకుండా ఉండాలంటే కష్టమే. పాఠశాలల్లో భౌతికదూరం నిబంధనలు విధించిన వేళ వారికి ఈ కష్టాలు తప్పడంలేదు. మార్చి నెల మధ్యలోనే థాయ్లాండ్లో లాక్డౌన్ విధించారు. దీంతో అకస్మాత్తుగా పాఠశాలలన్నీ మూతబడ్డాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత బ్యాంకాక్లోని ఈ పాఠశాల జులైలో ప్రారంభమైంది. చిన్నారులకు కొవిడ్ ముప్పు పొంచి ఉన్నందున పాఠశాలలను సురక్షిత వాతావరణంలో కొనసాగించేందుకు యాజమాన్యం, ఉపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
చిట్టిపొట్టి చిన్నారులు ఉపయోగించిన చోట పరిశుభ్రత తక్కువగా ఉండటం సాధారణమే. అలాంటప్పుడు కరోనా సమయంలో ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం పాఠశాల యాజమాన్యాలకు పెద్ద సవాలే. కానీ, చిన్నారులు వాడిన షింక్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ప్రతి తరగతి గది బయట సబ్బులు, చేతుల్ని శుభ్రపరుచుకొనే షింక్లను ఏర్పాటు చేశారు. తరగతి గదితో పాటు భోజనం చేసే ప్రాంతాల్లో భౌతికదూరం పాటించేలా ప్లాస్టిక్ కవర్లతో బాక్స్ల్లా రూపొందించారు. అలాగే, హ్యాండ్ శానిటైజర్లు, ఉష్ణోగ్రతలు తెలిపే స్కానర్లను ఎక్కడికక్కడ ఉంచారు. దాదాపు నెల నుంచి ఈ పాఠశాల తెరిచి ఉన్నప్పటికీ అక్కడ ఒక్క కొవిడ్ కేసూ నమోదు కాకపోవడం విశేషం.
దేశ వ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించాలనే ఉద్దేశంతో థాయ్లాండ్ ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను కొంతవరకు సడలించినప్పటికీ ద వాట్ ఖ్లోంగ్ టాయ్ పాఠశాల మాత్రం భౌతికదూరం నిబంధనలను కఠినంగా అమలుచేయాలని నిర్ణయించుకుంది.
ఆగ్నేయ ఆసియా దేశమైన థాయ్లాండ్ జనాభా దాదాపుగా ఏడు కోట్లు. అక్కడ కరోనా మరణాలు ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పటివరకు థాయ్లాండ్లో 3356 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో 3169మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ వైరస్ బారిన పడి కేవలం 58మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్