చైనా ఆశలు రెండుగంటల్లోనే ఫసక్..!
‘మనోళ్లు చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తున్నారుగా.. మనం ఈ లోపు కొత్త ప్రదేశాలు ఆక్రమిద్దాం.. అప్పుడు భారత్ ఎంత అరిచి గీపెట్టినా వెనక్కి తగ్గొద్దు..’ ఇది ఆగస్టు 31కి ముందు చైనా దళాల ప్లాన్..
మిలమిలలాడే రాకెట్ లాంఛర్లతో డ్రాగన్ మూకకు స్వాగతం
మెరుపు వేగంతో శిఖరాలు స్వాధీనం చేసుకొన్న భారత దళాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘మనోళ్లు చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తున్నారుగా.. మనం ఈ లోపు కొత్త ప్రదేశాలు ఆక్రమిద్దాం.. అప్పుడు భారత్ ఎంత అరిచి గీపెట్టినా వెనక్కి తగ్గొద్దు..’ ఇది ఆగస్టు 31కి ముందు చైనా దళాల ప్లాన్.. ఆ రోజు రాత్రి మాల్డో-రజాంగ్లాకు అవసరమైన సరంజామాతో శిబిరం నుంచి బయల్దేరిన చైనా దళాలకు గట్టి షాక్ తగిలింది. మిలమిలలాడే రాకెట్ లాంఛర్లతో భారత దళాలు కనిపించాయి. ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా భారత్ బెదరకపోవడంతో హెచ్చరికగా కొన్ని రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపింది. గల్వాన్ వద్ద భారత్ చేసిన ప్రతిదాడి గుర్తొచ్చిందో ఏమో చైనా దళాలు కాళ్లీడ్చుకొంటూ తిరిగి తమ స్థావరానికి చేరుకొన్నాయి.. ఈ ఆపరేషన్ మొత్తాన్ని కేవలం 120 నిమిషాల్లో ముగించింది.
ఆలోచనా తీరు మారడంతో...
గల్వాన్ ఘటనకు ముందు భారత్ దళాలు కొంత ఆత్మరక్షణ శైలిని అనుసరించేవి. 1962 యుద్ధం తర్వాత భారత్ అనుసరించే ఈ శైలిని చైనా వాడుకొంది. తరచూ మన భూభాగాలను చిన్నచిన్న ముక్కలుగా ఆక్రమించడం మొదలుపెట్టింది. గల్వాన్ ఘటన తర్వాత జులై 3న ప్రధాని మోదీ లద్దాక్లో పర్యటించారు. ఈ సందర్భంగా నార్తన్ కమాండర్ వైకే జోషీ, 14 క్రాప్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ దశలో ప్రధాని ‘చైనా ఏం చేసింది.. ఏం చేయబోతోందో నాకు అనవసరం.. మీరు ఏం చేశారు.. ఏం చేయబోతున్నారనే దానిపైనే నాకు ఆసక్తి’ అని తేల్చిచెప్పారు. అనంతరం మోదీ 17 క్రాప్స్ను ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్మీలో మౌంటేన్ స్ట్రైక్ గ్రూప్ ఇదొక్కటే. చైనాతో డీల్ చేయడానికి దీనిని అక్కడకు తరలించారు.
మోదీ పర్యటన ఓ రకంగా భద్రతా దళాలకు స్వేచ్ఛనిచ్చింది. అప్పటి నుంచి వ్యూహం మారిపోయింది. చైనా ఆధీనంలోని భూభాగాన్ని విడిపించాలంటే.. చైనాకు కీలకమైన చోట మనం పట్టుబిగించాలని నిర్ణయించారు. చైనాకు కీలకమై పర్వత శిఖరాలను భారత్ ఆధీనంలోకి తీసుకురావాలనుకున్నారు. దీనికి తోడు ఆర్మీచీఫ్ ముకుంద్ నరవాణేకు గతంలో చైనాతో డీల్ చేసి అనుభవం ఉంది. అది భారత్ వ్యూహాలకు బాగా ఉపయోగపడింది. మన దళాలు నిశ్శబ్ధంగా ఓ ప్రణాళికను సిద్ధం చేశాయి. ఇది కేవలం అత్యున్నత స్థాయిలోని వారికి మాత్రమే తెలుసు. ఆ ఆపరేషన్లో పాల్గొనే దళాలకు కూడా ఏం చేయబోతున్నారో తెలియదు. మెల్లగా ఎల్ఏసీ వెంట భారత్ అదనపు బలగాలను తరలించడం మొదలుపెట్టింది. మరోపక్క భారత నావికాదళం మలక్కా జలసంధికి వెళ్లే మార్గాల్లో గస్తీని ముమ్మరం చేసింది. అప్పటికే ఉన్న మౌంటేన్ స్ట్రైక్ డివిజన్కు అదనంగా మరింత మంది పర్వతయోధులను రంగంలోకి దించింది. వీరందరినీ ఆపరేషన్కు సిద్ధం చేసే బాధ్యతను జీవోసీ 17 క్రాప్స్ లెఫ్టినెంట్ జనరల్ సవ్నీత్ సింగ్కు అప్పజెప్పారు. వీరే కాదు.. వివిధ విభాగాలకు చెందిన దళాలు భారీగా లద్దాక్ చేరడం మొదలైంది.
విఫలమైన కాలయాపన
చర్చలతో కాలయాపన చేయాలని చైనా వ్యూహం పన్నింది. పాంగాంగ్ వద్ద ఫింగర్ 4, 5ను చైనా వీడే విషయమై చాలా రౌండ్లపాటు చర్చలు జరిగినా అవి విఫలం అవుతూ వచ్చాయి. అనుకున్నట్లే జరుగుతుండటంతో చైనా మితిమీరిన ఆత్మవిశ్వాసంలోకి వచ్చింది. కొవిడ్, ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్న భారత్కు ఈ దళాల మోహరింపు తలకుమించిన భారంగా మారి.. ఇక చేతులు ఎత్తేస్తుందని భావించింది. ఒక్క తూటా కాల్చకుండానే విజయం సాధించొచ్చని అంచనా వేసుకొంది. కానీ, దీనికి భిన్నంగా.. భారత్ కూడా చైనానే బేరానికి వచ్చేట్లు చేయాలని నిర్ణయించింది. అందుకే ఈ సారి సరస్సుకు దక్షిణ ఒడ్డున ఎత్తైన శిఖరాలను లక్ష్యంగా చేసుకొంది.
ఆగస్టులో వేగంగా మార్పులు..
ఆగస్టు నాటికి మౌంటేన్ డిజిన్ జవాన్లు అక్కడి పరిస్థితులకు అలవాటుపడిపోయారు. దీంతోపాటు చైనా కదలికలపై నిఘాపెట్టారు.. వస్తున్న సమాచారం ఆధారంగా ప్రణాళికల్లో మార్పులు చేసుకొన్నారు. ఆగస్టు 24న ఒక ప్లాన్ అమలు చేయడానికి అత్యున్నత నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అదే సమయంలో భారత్ దేనికైనా సిద్ధంగా ఉందని.. సీడీఎస్ బిపిన్ రావత్ ప్రకటించారు.
మరోపక్క క్షేత్రస్థాయిలోని కంపెనీ కమాండర్లు, ప్లాటూన్ కమాండర్లు తామ ప్లాన్ అమలుకు అవసరమైన మార్గాలను గుర్తించి..వాటికి సమీపంలోనే మోహరించారు. కీలక బ్లాక్ టాప్, హెల్మెట్ టాప్ శిఖరాల స్వాధీనాన్ని కేవలం 120 నిమిషాల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పదాతి దళాన్ని చైనా వాయుసేన విమానాలు అడ్డుకొంటే ఎదుర్కొనేందుకు ఇగ్లా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణులను సిద్ధం చేశారు. కొన్ని దళాలు పర్వత పాదాల వద్ద హైమొబిలిటీ వాహనాలను సిద్ధంగా ఉంచాయి.
ఉన్నతాధికారుల నుంచి అమలుకు ఆదేశాలు వెలువడగానే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ దళాలు 120 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే కీలకమైన శిఖరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నాయి. అనంతరం దాదాపు 2,000 మందితో కూడిన ఒక సైనిక విభాగం ఆ ప్రదేశానికి చేరుకొన్నాయి. వీరి వద్ద ఫ్రాన్స్ తయారు చేసిన మిలన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, కార్ల గుస్తోవ్ రాకెట్ లాంఛర్లు ఉన్నాయి. ఇవి చైనా వాహనాలను తునాతునకలు చేయగలవు.
అదే సమయంలో మాల్డోలోని స్థావరం నుంచి బయల్దేరిన చైనా దళాలు మార్గం మధ్యలో భారత దళాలను చూసి ఖంగుతిన్నాయి. అయినా ముందుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో భారత్ వైపు నుంచి హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో చైనా దళాల భ్రమలు పటాపంచలై వాస్తవాంలోకి వచ్చాయి. వాస్తవానికి డ్రాగన్ బలగాలు మాల్డో నుంచి రజంగ్ లా వరకు చుట్టుపక్కల ప్రాంతాలపై తమ పట్టు పెంచుకోవాలనుకొన్నాయి. ఇది పూర్తిఅయితే స్పంగూర్ వద్ద డ్రాగన్ పట్టు పెరిగిపోతుంది. కానీ, భారత దళాలు పూర్తిస్థాయి ఆయుధాలతో అక్కడ దర్శనమివ్వడంతో తిరిగి మాల్డో స్థావరానికి వెళ్లిపోయాయి. ఫలితంగా దాదాపు యాభైఏళ్ల తర్వాత చైనా నేర్పిన విద్యను భారత దళాలు దానికే రుచి చూపించాయి. ఇప్పుడు చర్చల టేబుల్ వద్ద భారత్ కూడా బలంగా బేరం చేసే అవకాశం దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ