కొవిడ్ వ్యాక్సిన్ కీలక ప్రయోగాల్లో భాగమవుతారా?
‘కోవాగ్జిన్’ మూడో దశ మానవ ప్రయోగాలను భువనేశ్వర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేపట్టనున్నారు.
భువనేశ్వర్లో కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు
ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించిన అధికారిక సంస్థ
భువనేశ్వర్: కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్లు దేశీయంగా టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ‘కోవాగ్జిన్’ టీకా మూడవ దశ మానవ ప్రయోగాలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి లభించింది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలను ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేపట్టనున్నారు. కాగా వీటిలో వాలంటీర్లుగా పాల్గొనే ఆసక్తి ఉన్నవారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
దేశంలో కరోనా వైరస్ కట్టడికి అనువైన వ్యాక్సిన్ ఎంపిక తుది దశకు చేరుకున్నట్టే అని.. హ్యుమన్ ట్రయల్స్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఈ. వెంకటరావు అభిప్రాయపడ్డారు. ఈయన నగరంలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎస్యూఎం’ ఆస్పత్రి కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు. మూడో దశ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు జరిపేందుకు ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 21 వైద్య సంస్థల్లో ఇది ఒకటి కావటం గమనార్హం.
ప్రయోగాలు సాగేదిలా..
కోవాగ్జిన్ తొలి, రెండవ విడత ప్రయోగాలు సంతృప్తికరంగా పూర్తయ్యాయని.. కీలకమైన మూడోదశ ప్రయోగాలలో వేలాది వాలంటీర్లు పాల్గోనున్నారని డాక్టర్ రావు తెలిపారు. హ్యుమన్ ట్రయల్స్లో వైద్యసేవల సిబ్బంది కూడా పాల్గొంటారని ఈ సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు. ఈ క్రమంలో సగం మంది వాలంటీర్లకు ప్లాసిబోను.. మిగిలిన సగం మందికి కోవాక్జిన్ను ఇచ్చి పరీక్షిస్తామని ఆయన వివరించారు. ఈ విధంగా కరోనా నిరోధకతపై ఈ వ్యాక్సిన్ పనితీరును క్షణ్ణంగా పరిశీలిస్తామన్నారు.ఇప్పటి వరకు ఉన్న వయోపరిమితి తదితర అర్హతా ప్రమాణాలను సడలించి. ఆరోగ్యంగా ఉన్న వారిపై కూడా వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించనున్నామని డాక్టర్ వెంకటరావు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాల్లో భాగమయ్యేందుకు భారీగా ప్రజలు ముందుకొస్తున్నారని ఆయన తెలిపారు. అయితే 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులపైన మాత్రమే మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు www.ptctu.soa.ac ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సమాచారమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?