కరోనా చివరి మహమ్మారి కాదు: WHO
కరోనా వైరస్సే చివరి మహమ్మారి కాదని.. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉపద్రవాల్ని ఎదుర్కోవాల్సి రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. వాతావరణ మార్పులు, పశుసంరక్షణను సరిగా నిర్వహించలేకపోతే.....
జెనీవా: కరోనా వైరస్సే చివరి మహమ్మారి కాదని.. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉపద్రవాల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. వాతావరణ మార్పులు, పశుసంరక్షణను సరిగా నిర్వహించలేకపోతే మానవ ఆరోగ్య మెరుగు కోసం చేపడుతున్న చర్యలు వృథాయే అవుతాయని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి వైద్యారోగ్య విపత్తులు తలెత్తినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు చేతులు దులుపుకొంటున్నాయని ఆరోపించారు. దీన్ని ఆయన ప్రమాదకరమైన ధోరణిగా అభివర్ణించారు. ఆదివారం తొలిసారి జరగనున్న ‘అంటువ్యాధుల సన్నద్ధత’ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
కొవిడ్ మహమ్మారి నుంచి యావత్తు ప్రపంచం అనేక పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. ఇలా అంటువ్యాధుల తలెత్తినప్పుడు భయాందోళనకు గురికావడం.. నివారణకు డబ్బులు ఖర్చుపెట్టడం.. తర్వాత నిర్లక్ష్యం చేయడం పరిపాటిగా మారిందని వాపోయారు. తర్వాత రాబోయే మహమ్మారి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలిపారు. అంటువ్యాధుల విషయంలో దూరదృష్టి లోపిస్తే ప్రమాదాలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఉపద్రవాలు మానవులు, జంతువులు, ప్రకృతి మధ్య అంతర్లీనంగా పెనవేసుకున్న బంధాన్ని గుర్తుచేస్తాయని వివరించారు. ఈ బంధం దెబ్బతిన్న కొద్దీ ప్రమాదానికి మరింత చేరువవుతామని హెచ్చరించారు. భూగ్రహంపై నివసించడానికి ఉన్న అనుకూలతలకు ముప్పు వాటిల్లే కొద్దీ అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. వాతావరణ మార్పులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత సంవత్సర కాలంలో కరోనా మహమ్మారితో యావత్తు ప్రపంచం తలకిందులైందని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం ఒక్క మానన ఆరోగ్యానికి పరిమితం కాలేదని.. సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు మహమ్మారులను నివారించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎనిమిదికోట్ల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. వీరిలో 17.5లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి..
బ్రిటన్ ప్రయాణికుల సన్నిహితులకూ కొవిడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి