ఇవాళ కృష్ణాష్టమి.. జైలు కావాలా? బెయిలా?
ఓ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేటుచేసుకుంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం కావాలా? బెయిల్ కావాలా?..............
సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
దిల్లీ: ఓ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేటుచేసుకుంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం కావాలా? బెయిల్ కావాలా? అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే సరదాగా వ్యాఖ్యానించారు. మరో పిటిషన్పై విచారణ సందర్భంగా మహాభారతాన్ని ఉదహరించారు.
1994లో భాజపాకు చెందిన రాజకీయ నేత హత్య కేసులో కాంగ్రెస్కు చెందిన ధర్మేంద్ర వాల్వి, మరో ఐదుగురు ఆ పార్టీ కార్యకర్తలు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వాల్వి బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సీజేఐ ‘‘ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణుడు పుట్టింది జైలులోనే. మరి మీకు జైలు కావాలా? బెయిలు కావాలా?’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అందుకు ఆయన బెయిల్ కావాలని చెప్పడంతో ‘‘మంచిది. మీకు పెద్దగా మతం పట్టింపులు లేవనుకుంటా’’ అంటూ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.
సీఏఏకు సంబంధించిన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగానూ సీజేఐ ఇలానే సరదా వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు సంబంధించి డాక్టర్ కఫీల్ ఖాన్ను వీడియో కాన్ఫరెన్స్లో హాజరుపరచడాన్ని నేరుగా హాజరైనట్లు పరిగణిస్తారా? అన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సందేహానికి సీజేఐ సరదాగా సమాధానమిచ్చారు. ‘‘ఇక్కడ మహా భారత కాలం నుంచి వర్చువల్ విచారణలు జరుగుతున్నాయి’’ అంటూ చమత్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ను హాజరుగానే పరిగణిస్తామని స్పష్టతనిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)