బహిరంగ చర్చకు ట్రంప్-బైడెన్ సిద్ధం!
ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ గట్టి పోటీనే ఇస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే వీరిద్దరూ ఒకేవేదికపై తలపడనున్నారు. సెప్టెంబర్ 29న ఇద్దరు నాయకులు ముఖాముఖిగా బహిరంగ చర్చలో పాల్గొని ప్రత్యర్థుల ప్రశ్నలను ఎదుర్కొంటారు.
సెప్టెంబర్ 29న తొలి డిబేట్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలంటేనే ప్రపంచం మొత్తానికి ఆసక్తి. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతోన్న సమయంలో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రిపబ్లికన్ నేత, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ గట్టి పోటీనే ఇస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే వీరిద్దరూ ఒకేవేదికపై తలపడనున్నారు. సెప్టెంబర్ 29న ఇద్దరు నాయకులు ముఖాముఖిగా బహిరంగ చర్చలో పాల్గొని ప్రత్యర్థుల ప్రశ్నలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఇద్దరికీ ఉన్న ట్రాక్ రికార్డులతోపాటు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, శాంతి భద్రతలు, విదేశాంగ విధానం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు.
అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీపడుతున్న నాయకులు బహిరంగంగా చర్చించడం గతకొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్, జోబైడెన్ ముఖాముఖి చర్చకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ ముఖాముఖి చర్చలను ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కమిషన్(సీపీడీ) నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా తొలి చర్చ సెప్టెంబర్ 29న జరుగుతుంది. ఫాక్స్ న్యూస్ యాంకర్ క్రిస్ వాల్లేస్ ఆధ్వర్యంలో తొలి డిబేట్ జరుగనుంది. అక్టోబర్ 15, 22 తేదీల్లో జరిగే మరో రెండు చర్చలను సీ-స్పాన్, ఎన్బీసీ వార్త సంస్థలు నిర్వహించనున్నాయి. ప్రెసిడెన్షియల్ డిబేట్ కోసం ఇప్పటికే తాను సన్నద్ధమవుతున్నట్లు ట్రంప్ తాజాగా వెల్లడించారు.
ఇక ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న నాయకుల మధ్య ఒకసారి ఇలాంటి చర్చ ఉంటుంది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మరోసారి పోటీలో ఉండగా, డెమొక్రాటిక్ తరుపున కమలా హారిస్ పోటీలో ఉన్నారు. అక్టోబర్ 7న జరిగే వీరి ముఖాముఖి చర్చను యూఎస్ఏ టుడే జర్నలిస్ట్ సుసాన్ పేజ్ నిర్వహిస్తారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష డిబేట్లకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని సీపీడీ కో-ఛైర్మన్ ఫ్రాన్క్ ఫారెన్కోఫ్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు 5 నుంచి 15కోట్ల మంది చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్..!
అమెరికాలో అధ్యక్షపదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా ముఖాముఖి చర్చల్లో పాల్గొనడం 1960నుంచి మొదలైంది. సెప్టెంబర్ 26, 1960 సంవత్సరంలో చికాగోలో నిర్వహించిన తొలి డిబేట్లో జాన్ ఎఫ్ కెన్నడీ, రిచర్డ్ నిక్సాన్ పాల్గొన్నారు. అలా ఆ సంవత్సరం ఇద్దరు అభ్యర్థులు నాలుగు సార్లు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమాలను టీవీల్లో ప్రసారం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జాన్ కెన్నడీ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అలా ఆ కార్యక్రమం అమెరికా రాజకీయాల్లోనే నూతన అధ్యాయానికి తెరతీసింది. అప్పటినుంచి ఇప్పటివరకు అధ్యక్ష బరిలోఉండే అభ్యర్థులు ముఖాముఖి చర్చలో పాల్గొనే సంప్రదాయం కొనసాగుతోంది. అనంతరం వీటిని పక్షపాతరహితంగా నిర్వహించేందుకు 1987లో ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కమిషన్ (సీపీడీ)ను ఏర్పాటు చేశారు. అయితే, సీపీడీ అక్కడి ప్రభుత్వం నుంచి కానీ, ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి నుంచి ఎటువంటి నిధులు స్వీకరించదు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగతంగా కాకుండా ఇలాంటి బహిరంగ చర్చల్లో అభ్యర్థులు పాల్గొనడం ద్వారా తాము గెలుపొందితే, అనుసరించే విధానాలను, చేపట్టే కార్యక్రమాలను ఓటర్లు సులువుగా తెలుసుకునే వీలుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!