ట్రంప్కు కరోనా.. చైనా ఎగతాళి..!
వైరస్ బారినపడినట్లు ట్రంప్చేసిన ప్రకటనపై కొందరు ఆశ్చర్యం, సానుభూతి వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఎగతాళి చేయడం కనిపిస్తోంది.
ట్రంప్ దంపతులు తగిన మూల్యం చెల్లించారు: గ్లోబల్ టైమ్స్
దిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా ఇప్పటికే కరోనా వైరస్ ధాటికి వణికిపోతోంది. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు వైరస్ సోకినట్లు తేలడంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు స్పందిస్తున్నారు. వైరస్ బారినపడినట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై కొందరు ఆశ్చర్యం, సానుభూతి వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఎగతాళి చేయడం కనిపిస్తోంది. ముఖ్యంగా తమపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోన్న ట్రంప్కు వైరస్ సోకడంతో ఆయనపై కామెంట్లు చేసేందుకు చైనీయులు మాత్రం తాపత్రయపడుతున్నారు.
మార్కెట్లు డీలా..!
బలమైన ఆర్థికవ్యవస్థ కలిగిన అగ్రరాజ్య అధ్యక్షుడికి వైరస్ సోకడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలియగానే తొలుత ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లన్నీ డీలా పడ్డాయి. ఆందోళనకు గురైన మదుపరులు తమ పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరించారు. దీంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాతోపాటు ఆసియా మార్కెట్లు కూడా నష్టాలవైపు పరుగు తీశాయి. అంతేకాకుండా ఆయిల్ ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అటు జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అమెరికా ఎన్నికల ముందు ఇది ఊహించని పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చైనా ఎగతాళి..!
ట్రంప్ దంపతులకు వైరస్ సోకిన విషయాన్ని చైనా అధికారిక మీడియా కూడా ప్రసారం చేసింది. ఇక చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ మరింత ముందుకెళ్లింది. ‘కరోనా వైరస్ పరిస్థితిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ దంపతులు తగిన మూల్యం చెల్లించారు’ అని పత్రికా సంపాదకుడు హూ షీజిన్ ట్విటర్లో పేర్కొన్నారు. అమెరికాలో కరోనా పరిస్థితి ఎలా ఉందనే దానికి ఈ వార్త అద్దం పడుతోందన్నారు. ఇది అమెరికాపైనే కాకుండా ట్రంప్కు వ్యక్తిగతంగానూ, త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని షీజిన్ అభిప్రాయపడ్డారు. అక్కడి మీడియానే కాకుండా చైనీయులు కూడా ట్రంప్కు కరోనా సోకడంపై భారీగా స్పందిస్తున్నారు. అక్కడ ఎక్కువగా ఉపయోగించే సామాజిక మాధ్యమం వీబో యాప్లో ఈ వార్తకోసమే ఎక్కువగా వెతకడంతోపాటు ట్రంప్ను ఎగతాళి చేస్తూ కామెంట్లు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయితే చైనా ప్రభుత్వం మాత్రం ట్రంప్కు కరోనా సోకిన విషయంపై అధికారికంగా స్పందించలేదు.
ప్రపంచదేశాలు ఏమన్నాయంటే..?
ఇదిలాఉంటే, వైరస్ బారినపడినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మిత్రుడు ట్రంప్, ఆయన సతీమణి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ట్రంప్కు వైరస్ సోకడంపై ఆస్ట్రేలియా కూడా స్పందించింది. ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని ఆస్ట్రేలియా వ్యవసాయశాఖ మంత్రి, కన్జర్వేటివ్ నేషనల్స్ పార్టీ ఉపనేత డేవిడ్ లిటిల్ప్రౌడ్ ప్రార్థించారు. అయితే, ఈ వైరస్ నుంచి ఎవరూ తప్పించుకోలేరనే విషయాన్ని ఇది తేటతెల్లంచేస్తోందని.. ముందుజాగ్రత్తలు తీసుకున్నా కూడా వైరస్ బారినపడే అవకాశాలున్నాయని లిటిల్ప్రౌడ్ స్పష్టంచేశారు. ట్రంప్ మాస్కు ధరించకపోవడాన్ని టోక్యో గవర్నర్ను విలేకర్లు ప్రశ్నించగా, ఆమె నేరుగా దీనిపై స్పందించలేదు. జపాన్లో మాత్రం విస్తృతంగా మాస్కులు ధరిస్తున్నామని ట్రంప్ ప్రస్తావన లేకుండానే ఆమె బదులిచ్చారు. మరికొందరు జపనీయులు మాత్రం డిస్ఇన్ఫెక్షన్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇరాన్ వార్తా సంస్థలు కూడా ట్రంప్కు వైరస్ సోకిన విషయాన్ని వ్యంగ్య చిత్రాలతో ప్రసారం చేశాయి. ఇక చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్తో పాటు అంతర్జాతీయ మీడియా ట్రంప్కు కరోనా సోకిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి.
యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్కు చైనానే కారణమంటూ తొలినుంచి డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో దాన్ని చైనా వైరస్గానే అభివర్ణించారు. దీనికి చైనా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ తీరుపై కూడా ట్రంప్ మండిపడ్డారు. వ్యక్తిగతంగా మాస్కు ధరించే విషయంలోనూ ట్రంప్ మొండిగానే వ్యవహరించారు. ఈ సమయంలో చివరకు ట్రంప్కు వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా తీరుపై మరోసారి ట్రంప్ స్పందిస్తారా? లేక ఎన్నికలు దగ్గరపడుతోన్న సమయంలో క్వారంటైన్లోనే ఉండి ఎన్నికల వ్యూహరచనల్లో నిమగ్నమవుతారా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్