ట్రంప్నకు మద్దతు కరువయ్యిందా..?
ఓట్ల లెక్కింపు ఆపాలని కోరుతూ..అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు సొంత పార్టీనుంచే మద్దతు కరువైనట్లు తెలుస్తోంది.
సొంతపార్టీ నేతలే మౌనంగా ఉన్నారన్న ట్రంప్ జూనియర్
వాషింగ్టన్: అమెరికా ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్న వేళ.. గెలుపు ఎవరిదనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు ఆపాలని కోరుతూ..అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు సొంత పార్టీనుంచే మద్దతు కరువైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ..వారిపై పోరాడుతున్న తమకు రిపబ్లికన్ పార్టీ నుంచే మద్దతు లభించడం లేదని ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ ట్విటర్లో అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పార్టీలో కీలక నేతగా ఉన్న నిక్కీ హేలీ, ఈ వ్యవహారంపై మాట్లాడక పోవడంపై ట్రంప్ జూనియర్ మండిపడ్డారు. 2024లో ఎన్నికల్లో అధ్యక్ష పదవిపై ఆశలుపెట్టుకున్న కొందరు రిపబ్లికన్లు, ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకుండా మౌనంగా ఉన్నారని ఆమెను పరోక్షంగా విమర్శించారు.
‘ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎన్నికల ప్రక్రియపై నిజంగా పోరాడుతున్నది, ఎవరు మౌనంగా కూర్చున్నారనే విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలి. గతకొన్ని దశాబ్దాలుగా రిపబ్లికన్లు వెనుకబడి ఉండడం వల్లే ఇతర పక్షాలు ఇలా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు ముగింపు పలికేందుకు ప్రతిఒక్కరు కృషిచేయాలి’ అని ట్విటర్లో ట్రంప్ జూనియర్ అభిప్రాయపడ్డారు.
బయట నుంచి అంతంతే..!
ఎన్నికల ఫలితాలు కీలక దశకు చేరుకున్న సమయంలో.. కేవలం సొంతపార్టీ నుంచే కాకుండా ట్రంప్నకు బయటనుంచి కూడా మద్దతు లభించడం లేదనే వాదన ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో జోబైడెన్ ఆధిక్యంలో ఉండటం, ట్రంప్నకు కాస్త ఆధిక్యం తగ్గడం కనిపిస్తోంది. బైడెన్ ఆధిక్యం ఉన్నచోట్ల కౌంటింగ్పై అనుమానాలు వ్యక్తంచేస్తోన్న ట్రంప్ ప్రచార బృందం వీటిపై ఇప్పటికే న్యాయస్థానాల్లో పోరాడుతోంది. ఓట్ల లెక్కింపును వెంటనే ఆపాలని కోర్టులను ఆశ్రయించినప్పటికీ.. మిషిగన్, జార్జీయా కోర్టుల్లో ట్రంప్ బృందానికి చుక్కెదురైంది. పెన్సిల్వేనియాలో ఇంకా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ కీలక నేతల నుంచి ట్రంప్నకు మద్దతు లభించడం లేదు. ముఖ్యంగా నిక్కీ హేలీ వంటి సీనియర్ నేతలు మౌనంగా ఉండటాన్ని ట్రంప్ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అయితే, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఎలాంటి రుజువులు లేకుండానే ట్రంప్ విమర్శలు చేయడంతో చాలా మంది రిపబ్లికన్ నేతలు మాట్లాడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా వైట్హౌస్లో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్న సమయంలోనూ అమెరికాలో కొన్ని మీడియా సంస్థలు ఆయన ప్రసంగాన్ని నిలిపివేశాయి.
ట్రంప్ను బహిరంగంగానే విమర్శించే నిక్కీ..
ఇదిలాఉంటే, 2024లో అధ్యక్ష పదవికి పోటీ నిక్కీహేలీ పోటీపడే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యాయమే నిక్కీ హేలీ అధ్యక్షపదవికి పోటీ పడతారని కూడా తొలుత వార్తలు వచ్చాయి. అయితే, వీటిని నిక్కీ హేలీ పలుసార్లు ఖండించారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ట్రంప్నకు మద్దతుగా నిలిచారు. గతంలో ట్రంప్ తీసుకున్న కొన్ని చర్యలను నిక్కీ హేలీ పలుసందర్భాల్లో విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ముందు నిక్కీ హేలీ దక్షిణ కరోలినా గవర్నరుగా పనిచేశారు. 2010, 2014 రెండు పర్యాయాలు ఈ రాష్ట్ర గవర్నర్గా ఎన్నికయ్యారు. అయితే, 2016లో ట్రంప్ ప్రభుత్వంలో చేరే వరకు ద.కరోలినా గవర్నరుగా ఉన్నారు. అనంతరం ఐక్యరాజ్యసమితిలో కీలక పదవిలో కొనసాగారు. నిక్కీహేలీ భారత సంతతికి చెంది వ్యక్తి కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్