జో బైడెన్ వైపే అమెరికన్ ఇండియన్ల మొగ్గు: సర్వే
వాషింగ్టన్: భారతీయ ఓటర్లు తనవైపే ఉన్నారని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆత్మరక్షణలో పడ్డారు. భారతీయ అమెరికన్ల ఓట్లు తమవేనంటూ రిపబ్లికన్లు ధీమాగా ఉండటం ఇకపై చెల్లదని ఇటీవలి ఓ సర్వేలో వెల్లడైంది. ఇండియా స్పోరా, ఆసియా అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మెజారిటీ భారతీయ అమెరికన్లు జో బైడెన్కే తమ ఓటు అని చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
భారతీయుల మద్దతు.. ఎవరికెంతంటే
ఈ సర్వే ప్రకారం 66 శాతం మంది భారతీయ అమెరికన్లు బిడెన్కు మద్దతిస్తుండగా.. కేవలం 28శాతం మాత్రమే తాము ట్రంప్ పక్షమని చెప్పారు. ఎన్నికల సమయానికి ఈ సంఖ్య 30 శాతానికి మించదని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ట్రంప్ తన దుందుడుకు చర్యలతో సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని వారు అంటున్నారు. హెచ్-1బీ వీసా జారీపై నిషేధాజ్ఞలు తదితర నిర్ణయాల ప్రభావం భారతీయ ఓటర్లపై పడింది. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం, కరోనా వైరస్ కట్టడి తదితర విషయాల్లో ఆయన ప్రతిష్ట మసకబారింది. ఇక 2009 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ (77) భారతీయులతో చక్కటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించారు. అదేవిధంగా కమలా హ్యారిస్ను వ్యూహాత్మకంగా తొలి ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకుని చరిత్ర సృష్టించారు. ఒకరకంగా ట్రంప్పై వ్యతిరేకతే బైడెన్కు కలసివచ్చే మరో అంశమని చెప్పవచ్చు.
బలపడుతున్న భారతీయులు
అమెరికాలో ఓటు హక్కు కలిగిన భారతీయ అమెరికన్ల సంఖ్య 18 లక్షలకు పైమాటేనని అంచనా. మరీ ముఖ్యంగా టెక్సాస్ (1,60,000)తో సహా పెన్సిల్వేనియా (61,000), మిచిగన్ (45,000), ఫ్లోరిడా (87,000), ఉత్తర కరోలినా (36,000), జార్జియా (57,000) తదితర రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులు ఫలితాలను నిర్ణయించే కీలకంగా మార్చవచ్చని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరో వైపు జూన్ వరకు అందిన గణాంకాల ప్రకారం.. నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఇక్కడి భారతీయులు 30 లక్షల డాలర్లకు పైగా విరాళం అందజేసినట్టు తెలిసింది. అమెరికాలో భారతీయ జనాభా పెరుగుదల, వారు ఆర్థికంగా, రాజకీయంగా చురుకైన భాగస్వామ్యం తీసుకోవటంతో వీరి నిర్ణయం అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కీలకం కావచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో భారతీయులపై విద్య, ఉద్యోగాలు, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, పర్యావరణం తదితర అంశాలు అధికంగా ప్రభావం చూపనున్నాయని తెలిసింది.
ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ల మద్దతు, మెప్పు కోసం రెండు ప్రధాన పార్టీలు ప్రయత్నించటంలో ఆశ్చర్యం లేదని ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు రంగస్వామి వివరించారు. కాగా తమ ప్రాముఖ్యతను ఇరు పార్టీలు గుర్తించటం ఆనందంగా ఉందని.. భారతీయ అమెరికన్ల ప్రాబల్యం ఇంకా పెరగనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Google Password Manager: హోమ్ స్క్రీన్లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్.. ఇక ఆ చింతక్కర్లేదు!
-
General News
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 6 కి.మీ పైగా క్యూలైన్!
-
World News
Jerusalem shooting: జెరూసలెంలో కాల్పులు.. పలువురికి గాయాలు..
-
India News
India Corona : 14 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు..
-
Movies News
RRR: ఆస్కార్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
-
Ts-top-news News
TSRTC: ఆర్టీసీకి భారీ గి‘రాఖీ’.. రికార్డు స్థాయిలో వసూళ్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్ఝున్వాలా హఠాన్మరణం
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Ross Taylor : ఆ మ్యాచ్లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?