ట్రంప్ ఓటమిని అంగీకరించాల్సిందే: ఒబామా
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇకనైనా ఓటమిని అంగీకరించాలని అధ్యక్షుడు ట్రంప్నకు సూచించారు. దేశ హితం కోసం ట్రంప్ తన అహాన్ని, స్వప్రయోజనాన్ని పక్కనబెట్టాలని........
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇకనైనా ఓటమిని అంగీకరించాలని అధ్యక్షుడు ట్రంప్నకు ఆయన సూచించారు. దేశ హితం కోసం ట్రంప్ తన అహాన్ని, స్వప్రయోజనాన్ని పక్కనబెట్టాలని హితవు పలికారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీబీఎస్కు ఇచ్చిన తొలి ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు బైడెన్ గెలుపును పరోక్షంగా గుర్తిస్తూనే.. మరోవైపు ఓటమిని అంగీకరించేదే లేదని ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఒబామా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి నియమ నిబంధనలను తుంగలో తొక్కి, సంప్రదాయాల్ని పక్కనబెడుతుంటే తాను చూస్తూ ఉండలేకపోయానని ఒబామా తెలిపారు. గతంలో అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తిగా ట్రంప్ తీరు సవ్యంగా లేదని చెప్పడం తన బాధ్యతగా భావించానన్నారు. తన అభిమానులు సైతం అదే కోరుకున్నారన్నారు. అందుకే, ఎన్నికల ప్రచారంలో నోరు విప్పాల్సి వచ్చిందని వివరించారు.
ప్రత్యర్థి దేశాలు అమెరికా బలహీనపడిందని భావిస్తున్నాయన్నారు. కేవలం ఈ ఎన్నికల తీరే కాకుండా గత కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే అందుకు కారణమని తెలిపారు. ఇవన్నీ చూసిన ప్రత్యర్థులు అమెరికాను కొల్లగొట్టడం సాధ్యమేనన్న నిర్ణయానికి వచ్చారన్నారు.
దేశం పూర్తిగా రెండు భాగాలుగా విడిపోయిందని తాజా ఎన్నికలు నిరూపించాయని ఒబమా అన్నారు. ఈ స్థితిలో ఓ ప్రజాస్వామ్య దేశాన్ని ముందుకు నడపడం సాధ్యం కాదన్నారు. ఇకపై నిత్యం అసత్యాలు ప్రచారం చేసే అధ్యక్షుడు శ్వేతసౌధంలో ఉండబోరన్నారు. నియమ నిబంధనల్ని బేఖాతరు చేసే వ్యక్తి చేతిలో అధికారం ఉండబోదంటూ పరోక్షంగా ట్రంప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇకనైనా ప్రజలు ఏకతాటిపై ముందుకు సాగాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా