US కంటే భారత్లోనే ట్రంప్ ఎక్కువ పన్నులు కట్టారట!
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ కొత్త కొత్త వివాదాలు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలు తనకు ప్రతికూలంగా వస్తే అధికార బదిలీ అంత సులువు కాదని సంకేతాలిచ్చి ఇప్పటికే విమర్శలపాలైన ఆయన తాజాగా అక్కడి................
న్యూయార్క్ టైమ్స్ ఆసక్తికర కథనం
వాషింగ్టన్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ కొత్త కొత్త వివాదాలు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలు తనకు ప్రతికూలంగా వస్తే అధికార బదిలీ అంత సులువు కాదని సంకేతాలిచ్చి ఇప్పటికే విమర్శలపాలైన ఆయన తాజాగా అక్కడి ఫెడరల్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆధారాలతో సహా ప్రచురించిన ఓ కథనం చర్చనీయాంశంగా మారింది. బిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన ట్రంప్ ఓ సంవత్సరంలో కేవలం 750 డాలర్ల పన్ను మాత్రమే చెల్లించారని ఆ కథనం కుండబద్దలు కొట్టింది.
ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన 2016లో 750 డాలర్లు మాత్రమే ఫెడరల్ ప్రభుత్వానికి పన్నుగా చెల్లించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అలాగే శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తొలి సంవత్సరం 2017లోనూ 750 డాలర్లు మాత్రమే చెల్లించినట్లు వెల్లడించింది. గత 20 ఏళ్ల ఆదాయ పన్ను రిటర్నుల రికార్డులను సంపాదించిన న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. గత 15 ఏళ్లలో మొత్తం 10 సంవత్సరాలు ట్రంప్ ఫెడరల్ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను కట్టలేదని తెలిపింది. విదేశాల్లోనూ పన్నులు చెల్లిస్తున్నట్లు ఓ సందర్భంలో ట్రంప్ స్వయంగా వెల్లడించారు. 2017లో ఆయన, ఆయన కంపెనీలు కలిపి భారత ప్రభుత్వానికి 1,45,400 డాలర్లు పన్ను రూపంలో చెల్లించినట్లు టైమ్స్ ఓ సందర్భంలో పేర్కొంది. ఈ లెక్కన అమెరికాలో చెల్లించిన దానితో పోలిస్తే 2017లో ట్రంప్ భారత్లో కట్టిన పన్నులే ఎక్కువ!
దీనిపై స్పందించిన ట్రంప్ అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేశారు. తాను పన్నులన్నీ చెల్లిస్తూ వస్తున్నానని తెలిపారు. రిచర్డ్ నిక్సన్ అధ్యక్ష హోదాలో ఉన్న నాటి నుంచి ఆ పదవిలో ఉన్న ప్రతిఒక్కరూ ప్రతి ఏడాది వారి ఆదాయపు పన్ను వివరాలను బహిర్గతం చేస్తూ వచ్చారు. ట్రంప్ మాత్రం ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. పైగా ఆదాయపు పన్ను వివరాలు తెలియజేయాలని కోరిన వారితో ట్రంప్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. దీంతో ఆ వివరాల్లో అంతలా ఏముందనే అనుమానాలు తీవ్రమయ్యాయి. 2016లో కీలకంగా మారిన ఈ అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా రెండోసారి అధ్యక్ష రేసులో ఉన్న సమయంలోనూ ఇది ప్రత్యర్థులకు ప్రధాన అస్త్రంగా మారింది.
ట్రంప్ ఆర్గనైజేషన్కు చెందిన న్యాయవాది ఆలెన్ గార్టెన్ న్యూయార్క్ టైమ్స్ కథనంపై స్పందించారు. ‘‘అన్నీ కాకపోయినా.. అందులో ఉన్న చాలా విషయాలు అవాస్తవాలు. గత పదేళ్లలో ట్రంప్ మిలియన్ల డాలర్ల వ్యక్తిగత పన్ను చెల్లించారు. 2015లో అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించారు’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.