రైతుల ఉద్యమాన్ని వారు అదనుగా తీసుకుంటున్నారు!
రైతుల ఉద్యమాన్ని అదనుగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్న తుక్డే తుక్డే గ్యాంగ్లపై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పట్నాలోని భక్తిర్పూర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
పట్నా: రైతుల ఉద్యమాన్ని అదనుగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ‘తుక్డే తుక్డే గ్యాంగ్’లపై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పట్నాలోని భక్తిర్పూర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని వారు(నిరసనకారులు) చెబుతున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులకు గౌరవం ఇస్తోంది. కానీ రైతుల ఉద్యమాన్ని అదనుగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న ‘తుక్డే తుక్డే గ్యాంగ్’పై మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. కొందరు వ్యక్తులు రైతుల నిరసనల్లో చేరి.. దిల్లీ, మహారాష్ట్రల్లో అల్లర్లకు పాల్పడి జైల్లో ఉన్నవారిని విడుదల చేయాలని డిమాండ్లు లేవనెత్తుతున్నారు. అలాంటి వారి లక్ష్యాల్ని మేం విజయవంతం కానివ్వం’ అని రవిశంకర్ వెల్లడించారు.
‘కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవే. రైతుల్ని మండీ వ్యవస్థ నుంచి కాపాడి.. తమ ఉత్పత్తుల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా ఈ చట్టాలు సహకరిస్తాయి. రైతులకు అలాంటి స్వేచ్ఛ ఇవ్వాలా వద్దా అని నేను అడుగుతున్నా. బిహార్ ప్రజలు గోర్గాన్ గింజల్ని స్థానికంగా ఎందుకు అమ్మాలి.. గ్లోబల్ మార్కెట్లో ఎందుకు విక్రయించకూడదు?’ అని చట్టాల ప్రయోజనాల గురించి రవిశంకర్ వివరించారు.
‘నిరసనల్లో సంఘవిద్రోహ శక్తులు చేరి.. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి.. కాబట్టి రైతులు వారిపై దృష్టి సారించాలి’ అని ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సైతం చెప్పారు. శుక్రవారం టిక్రీ సరిహద్దులో నిరసనలు చేస్తున్న వారిలో కొందరు.. వివిధ కేసుల్లో అరెస్టైన నిందితుల్ని విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించిన విషయాన్ని ప్రత్యేకించి పేర్కొన్నారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.