20 ఏళ్ల క్రితం పోయింది..మళ్లీ తిరిగొచ్చింది 

మనకు నచ్చిన, విలువైన వస్తువులు పోగొట్టుకుంటే చాలా బాధపడతాం. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కొన్ని రోజులకు ఆ విషయాన్ని మర్చిపోతాం. కానీ, చాలా ఏళ్ల క్రితం పోగొట్టుకున్న వస్తువు అనుకోకుండా...

Published : 28 Aug 2020 10:44 IST

డబ్లిన్‌: మనకు నచ్చిన, విలువైన వస్తువులు పోగొట్టుకుంటే చాలా బాధపడతాం. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కొన్ని రోజులకు ఆ విషయాన్ని మర్చిపోతాం. కానీ, చాలా ఏళ్ల క్రితం పోగొట్టుకున్న వస్తువు అనుకోకుండా ఒక రోజు మన కళ్లముందు ప్రత్యక్షమైతే మన రియాక్షన్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సరిగ్గా అలాంటి సంఘటనే ఐర్లాండ్‌లో జరిగింది. దాదాపు 20 ఏళ్ల క్రితం పోయిన పర్సును పోలీసులు ఇంటికి తెచ్చివ్వడంతో ఓ వ్యక్తి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఐర్లాండ్‌ పోలీసులకు భూమిలో కూరుకుపోయిన ఓ పర్సు దొరికింది. దానిని తెరచి చూస్తే.. ఏటీఎం కార్డు, కొన్ని వివరాలు ఉన్నాయి. వాటి ఆధారంగా సంబంధిత వ్యక్తికి ఫోన్‌ చేస్తే.. తాను ఆ పర్సును 20 ఏళ్ల క్రితం పోగొట్టుకున్నట్లు చెప్పాడు. ఆధారాలను సరిచూసుకొని ఆ పర్సును సదరు వ్యక్తికి ఇచ్చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘ ఇరవై ఏళ్ల మిస్టరీని 24 గంటల్లో ఛేదించాం’’ అంటూ సంబంధిత ఫొటోను పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో, అది కాస్తా వైరల్‌గా మారింది. ‘‘ వాట్‌ ఏ గ్రేట్ న్యూస్‌, అద్భుతం‌, అసలు నమ్మలేకపోతున్నామే..!’’ అంటూ పలువురు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు