J&K: ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

జైషే మహమ్మద్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు..

Published : 11 Sep 2020 13:16 IST

కుప్వారా: జైషే మహమ్మద్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీ పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ద్రుగ్‌ముల్లా ప్రాంతంలోని చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కాగా అందులో ఒక ఏకే-47 రైఫిల్‌, రెండు గ్రనైడ్లు, మరిన్ని పేలుడు సామగ్రి, రూ.7 లక్షలు లభ్యమయ్యాయి. సైనికులు వారిని వెంటనే అదుపులోకి తీసుకొన్నారు. వారిని జైషే ఉగ్రవాదులుగా గుర్తించినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని